
Modi Tour : తెలంగాణలో బీజేపీ ఎన్నికల రేసులో వెనుకబడిందని ఆ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు మార్పులు, చేర్పులతో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు మేనిఫెస్టో కూడా బీజేపీ ఇంకా ప్రకటించలేదు. సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్ని కేడర్ జోష్ పెంచే ప్రయత్నం చేశారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు దీటుగా ప్రచారంలో దూకుడు పెంచేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. వరుసగా మూడు రోజులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేపట్టేలా ఈ నెల 25న కరీంనగర్లో నిర్వహించే జనగర్జన సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 26న నిర్మల్లోనూ జనగర్జన సభ నిర్వహిస్తారు. ఈ సభకు మోదీ హాజరవుతారు. ఈ నెల 27న హైదరాబాద్ లో మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.
మూడు రోజుల క్రితమే హైదరాబాద్ లో బీసీ గర్జన సభను భారీ ఎత్తును నిర్వహించిన కమలం పార్టీ.. ఈ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ‘సమగ్ర న్యాయానికి నాంది దండోరా..చలో హైదరాబాద్’ నినాదంతో, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభను నిర్వహించనుంది. ఈ సభలోనూ మోదీ పాల్గొంచారు. అలాగే సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఇలా బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచే ప్రయత్నం చేస్తోంది.