డయాబెటిస్ ఉన్న వారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని రకాల ఆహార పదార్థాలకు డయాబెటిక్ పేషెంట్లు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా తెల్ల బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.
బంగాళ దుంపలో అధిక మోతాదులో చెక్కర ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
అంతే కాకుండా కచోరీలు, పకోడీలు వంటి వేయించిన స్నాక్స్ అస్సలు తినకూడదు.
పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే కానీ డయాబెటీస్ ఉన్న వారికి ఇవి హానికరం
తియ్యటి పెరుగు, లస్సీ వంటి వాటిని షుగర్ పేషెంట్లు తీసుకోకుండా ఉంటేనే మంచిది.
పురీ, నాన్స్, పరాఠాలు రక్తంలో చెక్కర స్థాయిని పెంచుతాయి. వీటిని కూడా తినొద్దు.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పానీపూరీని కూడా తినకుండా ఉంటే బెటర్.