చేపలు మంచి పౌష్థికాహారం. కానీ శరీరానికి కావాల్సినంత కాల్షియం అందిచేందుకు చేపల కంటే మెరుగైన ఆహారాలు ఉన్నాయి. అవేంటంటే..

ఒక టేబుల్ స్పూన్ నువ్వులతో 88 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.

ఒక ఔన్స్ చియా గింజల్లో సుమారు 179 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది

కాల్షియం కోసం బాదం పప్పులు తినొచ్చు. కప్పు బాదంపప్పుల్లో 92 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.

సోయా బీన్స్ తో  చేసే టోఫూలో కాల్షియం బోలెడంత ఉంటుంది. అర కప్పు  టోఫూ తింటే 350 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.

అర కప్పు  కాలే కూరగాయలోను 94 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.

1 కప్పు ఉడకబెట్టిన బ్రోకలీలో 62 గ్రా. కాల్షియం ఉంటుంది.

ఎండబెట్టిన అంజీర పండ్లను అరకప్పు తింటే 121 మి.గ్రా.. కాల్షియం లభిస్తుంది.

ఒక్క నారింజలో 52 మి.గ్రా కాల్షియం లభిస్తుంది.

పాల ఉత్పత్తులు అన్నిటిలో మనకు కావాల్సినంత కాల్షియం లభిస్తుంది.