బాలీవుడ్‌లో ముగ్గురు ఖాన్స్‌తో నటించిన హీరోయిన్స్‌లో రాణి ముఖర్జీ ఒకరు.

రాణి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అంతటా విషెస్‌తో నిండిపోయింది.

2014లో యశ్ రాజ్ ఫిల్మ్స్ చైర్మన్ అయిన ఆదిత్య చోప్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది రాణి.

2015లో ఆదిత్య చోప్రాతో అదిరా అనే పాపకు జన్మనిచ్చింది రాణి ముఖర్జీ.

ఇప్పటికీ ఒక సినిమాకు రూ.7 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తూ దూసుకుపోతోంది.

రాణి ముఖర్జీ పర్సనల్ ఆస్తుల విలువే రూ.206 కోట్లు ఉంటాయని సమాచారం.

ఆదిత్య చోప్రా అత్యధిక ధనవంతుడైన ప్రొడ్యూసర్ కావడంతో తన ఆస్తులు రూ.7200 కోట్లు ఉంటాయని తెలుస్తోంది.

పెళ్లయ్యి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది రాణి.

రాణి చివరిగా నటించిన ‘మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే’కు అవార్డ్ కూడా అందుకుంది.

ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది రాణి ముఖర్జీ.