త్రిష 1983 మే 4న కృష్ణన్ అయ్యర్-ఉమా అయ్యర్ దంపతులకు జన్మించింది.
చెన్నైలోని చర్చి పార్క్లోని శాక్రిడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్ విద్యాబ్యాసం చేసింది.
డిగ్రి తర్వాత త్రిష మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.
1999లో 'మిస్ సేలమ్' అందాల పోటీలో పాల్గోని కీరిటం గెలుచుకుంది.
అదే ఏడాది 'మిస్ మద్రాస్' పోటీలోనూ గెలిచి మిస్ చెన్నైగా అందాల కీరిటాన్ని కైవసం చేసుకుంది.
2001లో జరిగిన మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న త్రిష 'బ్యూటీపుల్ స్మైల్' అవార్డును సొంతం చేసుకుంది.
2003లో తమిళ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించిన లెసా లెసా సినిమాతో హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయ్యింది.
ఆ తర్వాత పలు చిత్రాలు చేసి త్రిష తెలుగు డైరెక్టర్స్ని సైతం ఆకట్టుకుంది.
దాంతో 'నీ మనసు నాకు తెలుసు' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.