Big Stories

Sangareddy : పీడీఎస్ బియ్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు..

Sangareddy : 70 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కు చెందిన శంకరయ్య అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ మండల్, బీరేందర్ సింగ్ అనే వ్యక్తులను పనికి నియమించుకున్నారు. పాశమైలారంలో ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యన్ని అక్రమంగా వ్యాపారం చేస్తుంటాడు.

- Advertisement -

జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పక్కా సమాచారంతో దాడి చేసి 70 టన్నుల పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణకై బీడీఎల్ భానూర్ పోలీసు స్టేషన్ లో తరలించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News