Big Stories

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..

Ananthapur : తమ్ముడిని అన్న గొడ్డలి తో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి గురువారం రాత్రి నిద్రిస్తుండగా తన సొంత అన్న రవికుమార్ గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటనలో తమ్ముడు కృష్ణమూర్తి ప్రాణాలు కోల్పోయాడు.

- Advertisement -

హత్య అనంతరం శెట్టూరు పోలీస్ స్టేషన్ లో నిందితుడు రవికుమార్ లొంగిపోయాడు. అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం సెల్ ఫోన్ విషయంలో కొట్టుకున్నారని ఆ కోపంతో చంపాడని చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News