Big Stories

Chittoor : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరులో ట్రాక్టర్‌ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తిరుపతి స్విమ్స్‌, వేలూరు సీఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 26 మంది ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News