E-Paper
Advertisement

Bengaluru PG : పీజీలో యువతిపై కత్తితో దాడి.. ప్రేమోన్మాదం కాదు

Bengaluru PG : పీజీలో యువతిపై కత్తితో దాడి.. ప్రేమోన్మాదం కాదు

Bengaluru PG : తాను ప్రేమించిన యువతి ప్రేమను అంగీకరించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదనో ప్రేమోన్మాదులు యువతులపై దాడులకు పాల్పడుతున్నారు. కానీ బెంగళూరులో జరిగిన ఈ ఘటన అందుకు భిన్నం. పీజీలో ఉన్న యువతిపై ఓ యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలై మరణించింది. ఈ ఘటనంతా సీసీటీవీలో రికార్డయింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

బెంగళూరులోని ఒక పేయింగ్ గెస్ట్ హౌస్ లో బీహార్ కు చెందిన కృతి కుమారి(24) అనే యువతి ఉంటోంది. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆ యువతిపై ఓ యువకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. కత్తితో పొడిచి.. గొంతుకోసి పరారయ్యాడు. పక్క గదిలోనే యువతులు ఉన్నా.. వాళ్లు కనీసం అడ్డుకోలేదు. ఎవరూ స్పందించలేదు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతి తనను కాపాడమని వేడుకోవడం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘటన జరగడానికి రెండ్రోజుల ముందే ఆమె ఆ పీజీలోకి మారినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ సిబ్బందికి తాను కృతి సోదరుడినని, మాట్లాడి వెళ్లిపోతానని చెప్పి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

Also Read : తిరుపతిలో దారుణం, గంజాయి మత్తు.. లా స్టూడెంట్‌పై అత్యాచారం

దీనంతటికీ కారణం.. ప్రేమే. అయితే ఆ యువకుడు ఆమెను ప్రేమించలేదు. అతను ప్రేమించిన తన ప్రియురాలిని ఆమె తన నుంచి విడగొట్టిందన్న కారణంతో ఆమెపై పగ పెంచుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. తన ప్రియురాలిని తనకు కాకుండా చేసిందన్న కోపంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ఇంత జరుగుతున్నా.. హాస్టల్ సిబ్బంది, వార్డెన్ కూడా స్పందించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. యువతిని హత్య చేసిన వ్యక్తి పరారీలో ఉండటంతో.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×