![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/11/37a2dff33c3da75c1ea08be45a9f8da6.jpg)
AP High Court : ఏపీలో చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొనకుండా.. ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీ సీఎస్తో పాటు నలుగురు సీనియర్ IAS అధికారులకు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని రాజకీయ లబ్ధి కోసం అధికార వైఎస్సార్సీపీ చేపట్టిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసింది.