Big Stories

AP High Court : వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం.. సీఎస్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court : ఏపీలో చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమానికి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొనకుండా.. ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీ సీఎస్‌తో పాటు నలుగురు సీనియర్ IAS అధికారులకు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.

- Advertisement -

సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని రాజకీయ లబ్ధి కోసం అధికార వైఎస్సార్‌సీపీ చేపట్టిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News