Big Stories

KTR : దీక్షా దివస్ కార్యక్రమంపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. కేటీఆర్ కు నిబంధనలు పట్టవా?

KTR : దీక్షా దివస్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీక్షా దివస్ కార్యక్రమంతో కేటీఆర్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే కేటీఆర్ పై తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ కు హస్తం పార్టీ ఫిర్యాదు చేసింది. మీడియా క్లిప్పింగులను కూడా వికాస్ రాజ్ కు అందించారు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ నిరంజన్.

- Advertisement -

దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆఫీస్ లో కేటీఆర్ రక్తదానం చేయడాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు నిరంజన్. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉన్నా, 144 సెక్షన్ అమలులో ఉన్నా దీక్షా దివస్ ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

- Advertisement -

దిక్షా దివస్ కార్యక్రమం నిర్వహణ కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ వ్యవహారంలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News