Samsung New Mobiles Launch : ప్రముఖ జపాన్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ శ్యామ్సంగ్. ఎప్పుడూ కూడా తక్కువ బడ్జెట్తో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లను లాంచ్ చేస్తుంది. శ్యామ్సంగ్ ఫోన్లను భారత మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీ న్యూ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్లను బ్రెజిల్లో రిలీజ్ చేసింది.
శ్యామ్సంగ్ తన M సిరీస్ ఫోన్ల నుంచి 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో M15,M55 మోడళ్లు ఉన్నాయి. త్వరలో శ్యామ్సంగ్ లవర్లకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ వేరియంట్ల ధరలు, ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి.
Also Read : ఐపీఎల్.. ఈ ప్లాన్స్తో వాడుకున్నోలకి వాడుకున్నంత 5జీ డేటా!
Galaxy M55 5G మరియు Galaxy M15 5G ఫోన్లను అమోజాన్లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అతి త్వరలోనే భారత్ మార్కెట్లోకి ఈ ఫోన్లు రానున్నాయి. కానీ డేట్ను మాత్రం రిలీజ్ చేయలేదు.
Galaxy M55 5G స్నాప్డ్రాగన్ 7 Gen 1 SoC ప్రాసెసర్పై రానుంది. వాటర్నాచ్ డ్రాప్, S AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 6000mAh పవర్ఫుల్ బ్యాటరీ ఉంటుంది. Galaxy M55 మొత్తం మూడు వేరియంట్లలో రానుంది. ఇందులో 8GB + 128GB ధర రూ. 26,999గా ఉంది. 8GB + 256GB ధర రూ.
29,999గా నిర్థారించింది. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 32,999గా ఉండనుంది.
Also Read : 5జీ ఫోన్ ధరకే ఐఫోన్ 13, 14, 15.. మంత్ ఎండ్ సేల్ అదిరిపోయింది
Galaxy M15 5G స్మార్ట్ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. 4GB + 128GB దీని ధర రూ. 13,499. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999గా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్పై రానుంది. ఇందులో 6.5 ఇంచెస్ 90Hz రీఫ్రెష్ రేట్ కలిగిన ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 50మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఫ్రంట్ కెమెరా 13మెగాపిక్సెల్తో వచ్చే అవకాశం ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు మోడళ్లు కూడా డార్క్ బ్లూ, గ్రే, లైట్ బ్లూ కలర్స్లో రానున్నాయి.