Nissan Magnite Recall : జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ నిస్సాన్. తన కంపెనీకి చెందిన మాగ్నైట్ ఎస్యూవీని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజగా ఈ ఎస్యూవీలో కంపెనీ లోపాన్ని గుర్తించింది. తక్షణమే అలర్టై కొన్ని యూనిట్లు రీకాల్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
రీకాల్
నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ వెహికల్స్ను రీకాల్ చేసింది. సంస్థ ఎస్యూవీలో సెన్సార్ పనిచేయకపోవడం గురించి సమాచారం అందుకుంది. దీంతో దాని కొన్ని యూనిట్లు రీకాల్ చేసింది. లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత ఎన్ని యూనిట్లను రీకాల్ చేశారనే దానిపై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
Also Read : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఆరు కొత్త బైకులు.. ఫీచర్లు ఇవే!
రీకాల్ కారణం
సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ ఎస్యూవీ ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సార్లో లోపాన్ని గుర్తించింది. దీని కారణంగా వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కంపెనీ కొన్ని యూనిట్లకు రీకాల్ చేసింది. అయితే ఈ లోపం కారణంగా ఎస్యూవీ నడపడంలో ఎటువంటి సమస్య లేదు.
ఏ వేరియంట్ రీకాల్ చేయబడింది?
మాగ్నైట్ ఎస్యూవీలో రెండు వేరియంట్లను నిస్సాన్ రీకాల్ చేసింది. వీటిలో ఎంట్రీ లెవల్ XE, మిడ్ వేరియంట్ XL ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలోని కొన్ని యూనిట్లలో లోపాలను గుర్తించింది. కంపెనీ ప్రకారం నవంబర్ 2020, డిసెంబర్ 2023 మధ్య తయారు చేయబడిన యూనిట్లలో ఈ సమస్య ఉండవచ్చు. డిసెంబర్ 2023 తర్వాత తయారు చేయబడిన యూనిట్లలో అటువంటి లోపం లేదు.
Also Read : 9 సీట్లతో మహీంద్రా నుంచి కొత్త ఎస్యూవీ లాంచ్!
కంపెనీ రీకాల్ చేసిన యూనిట్లను నిస్సాన్ సమీప సర్వీస్ సెంటర్కు వెళ్లవలసి ఉంటుంది. లోపం ఉన్న భాగాన్ని తనిఖీ చేస్తారు. ఆ యూనిట్లలోని ఈ భాగంలో ఏదైనా లోపం కనుగొనబడితే.. అది కంపెనీ నుండి ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా మార్చ బడుతుంది. మరింత సమాచారం కోసం కస్టమర్లు కంపెనీ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.