E-Paper
Advertisement

Attack on Family: విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..!

Attack on Family: విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..!

Attack on Family in Visakhapatnam for Vote to TDP: ఎన్నికల ముగిసి 72 గంటలు గడిచినా ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఇద్దరు మహిళలు, ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన చుట్టుపక్కన వాళ్లు ఆసుపత్రిలో చేర్పించారు.

ఆడవాళ్లని చూడకుండా దాడి చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బును నిరాకరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పాశవిక దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలని డీజీపీని కోరారు చంద్రబాబు.

Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!

అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గూండాలు ఈ దాడులకు పాల్పడుతున్నారని, ఆడవారని చూడకుండా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×