Big Stories

Attack on Family: విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..!

Attack on Family in Visakhapatnam for Vote to TDP: ఎన్నికల ముగిసి 72 గంటలు గడిచినా ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఇద్దరు మహిళలు, ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన చుట్టుపక్కన వాళ్లు ఆసుపత్రిలో చేర్పించారు.

- Advertisement -

ఆడవాళ్లని చూడకుండా దాడి చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బును నిరాకరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పాశవిక దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలని డీజీపీని కోరారు చంద్రబాబు.

- Advertisement -

Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!

అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గూండాలు ఈ దాడులకు పాల్పడుతున్నారని, ఆడవారని చూడకుండా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News