BigTV English

Syed Mustafa Speech in Pak Parliament: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.. మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్..!

Syed Mustafa Speech in Pak Parliament: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.. మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్..!

Syed Mustafa Speech in Pakistan Parliament Gone Viral: పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దుర్బరంగా మారింది. దీంతో అక్కడి నేతలే ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బుధవారం పాక్ ఏంపీ సయ్యద్ ముస్తఫా కమల్ భారత్ చంద్రయాన్-3 సహా విజయం సాధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇందుకు సంబంంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


బుధవారం సయ్యద్ ముస్తఫా పార్లమెంట్ లో ప్రసంగిస్తూ..ప్రస్తుతం కరాచీలో పరిస్థితి ఎలా ఉందంటే భారత్ చంద్రుడిపైకి వెళుతుంటే కరాచీలో పిల్లలు మురికి కాలువలో పడి చనిపోతున్నారని అన్నారు. కరాచీలో తాగేందుకు స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. 70 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు దూరంగా ఉన్నారని వాపోయారు. పాకిస్థాన్ వ్యాప్తంగా 2.6 కోట్ల మంది చిన్నారులు స్కూళ్లకు దూరంగా ఉన్నారనే..నివేదికలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.

దేశానికి కరాచీ ప్రధాన వనరు అని ముస్తఫా కమల్ అన్నారు. కానీ కరాచీలో చిన్నారులు కాలువలో పడి మరణించినట్లు వార్తలు వస్తుయని పేర్కొన్నారు. దేశంలో రెండు ఓడరేవులు ఉండగా.. ఆ రెండు కరాచీలోనే ఉన్నాయని చెప్పారు. కానీ కరాచీకి 15 ఏళ్లుగా పరిశుభ్రమైన మంచి నీరు అందడం లేదని తెలిపారు. కరాచీ సింధు ప్రావిన్స్ రాజధాని అని 48 వేల పాఠశాలలు స్థానికంగా ఉన్నాయని అన్నారు.


Also Read: ‘పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కొంతమంది బలహీనత వల్లే చేజారింది’

చదువుకోని పిల్లల వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి నాశనం అవుతుందని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగానే మౌలానా ఫజ్లుర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. భారత్, పాక్ కలిసి స్వాతంత్ర్యం పొందాయని కానీ.. భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటే తాము మాత్రం కలలు కంటున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ముస్తఫా కమల్ భారత్ పై ప్రశంసలు కురిపించారు.

Tags

Related News

Tourist Tax: థాయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! టూరిస్ట్ ట్యాక్స్ విధించేందుకు సిద్ధం..?

Nobel Prize Chemistry: కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఇదిగో వారి పేర్లు

Attack on president Convoy: అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి.. తప్పించుకున్న ఆ దేశాధినేత

Nobel Prize Physics: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బహుమతి.. సర్క్యూట్‌లో టన్నెలింగ్ రహస్యాన్ని కనుగొన్నందుకు పురస్కారం

Nobel Prize 2025 Medicine: రోగ నిరోధక వ్యవస్థపై ఆవిష్కరణలు.. వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Nobel Prize Winners: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. వారి పేర్లు ఇవే

Mount Everest: ఎవరెస్ట్‌పై మంచు తుపాను ప్రతాపం.. మూసుకుపోయిన దారులు, చిక్కుకుపోయిన 1000 మంది

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Big Stories

×