BigTV English

EC Suspends Police Officials: ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్.. మరికొందరిపై విచారణ

EC Suspends Police Officials: ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్.. మరికొందరిపై విచారణ

Election Commission Serious on Violence in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో సీఎస్ డీజీపీల పనితీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.


పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడింది. వీరందరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. అలాగే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు సంబంధించిన 12 మంది పోలీసు అధికారులపై వేటు పడింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ అంశంపై దర్యాప్తు చేసి ఒక్కో కేసుకు సంబంధించి తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఈసీ కోరింది.


Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!

ఫలితాల ప్రకటన తర్వాత జరిగే హింసను నియంత్రించడానికి 25 సిఏపీఎఫ్ కంపెనీలను కౌంటింగ్ తర్వాత 15 రోజులు పాటు కావాలని ఏపీ ప్రభుత్వం అడగగా.. ఈసీ కేంద్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండపై భౌతికంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్, డీజీపీని ఆదేశించింది. దీంతో వారు ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ పోలీస్ అధికారులపై ఉక్కుపాదం మోపింది ఈసీ.

Also Read: AP Govt. to form SIT: ఏపీలో చెలరేగిన అల్లర్లపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×