E-Paper
Advertisement

EC Suspends Police Officials: ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్.. మరికొందరిపై విచారణ

EC Suspends Police Officials: ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్.. మరికొందరిపై విచారణ
Advertisement

Election Commission Serious on Violence in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో సీఎస్ డీజీపీల పనితీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడింది. వీరందరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. అలాగే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు సంబంధించిన 12 మంది పోలీసు అధికారులపై వేటు పడింది.

Advertisement

ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ అంశంపై దర్యాప్తు చేసి ఒక్కో కేసుకు సంబంధించి తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఈసీ కోరింది.

Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!

ఫలితాల ప్రకటన తర్వాత జరిగే హింసను నియంత్రించడానికి 25 సిఏపీఎఫ్ కంపెనీలను కౌంటింగ్ తర్వాత 15 రోజులు పాటు కావాలని ఏపీ ప్రభుత్వం అడగగా.. ఈసీ కేంద్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Advertisement

ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండపై భౌతికంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్, డీజీపీని ఆదేశించింది. దీంతో వారు ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ పోలీస్ అధికారులపై ఉక్కుపాదం మోపింది ఈసీ.

Also Read: AP Govt. to form SIT: ఏపీలో చెలరేగిన అల్లర్లపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×