PM Modi Sensational Comments on INDIA Bloc: లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ర్యాలీలకు అనుగుణంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతాప్గఢ్కు చేరుకుని I.N.D.I.A కూటమిపై విరుచుకుపడ్డారు. జిల్లాలోని ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ I.N.D.I.A బ్లాక్పై విరుచుకుపడ్డారు, “I.N.D.I.A కూటమిలో దేశ సైనికుల పరాక్రమంపై ప్రశ్నలు లేవనెత్తే వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వారి ఎజెండా మళ్లీ J&Kలో ఆర్టికల్ 370ని విధించడం. సీఏఏను రద్దు చేయడం,” అని ప్రధాని మోదీ మండిపడ్డారు.
ప్రతిపక్ష కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని తొలగించి, ఐదేళ్లపాటు ఐదు పార్టీలకు చెందిన ఐదుగురు ప్రధాన మంత్రుల ఫార్ములాతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నదని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ ఇండియా కూటమిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమిలో పార్టీలు దోచుకోవడానికి తమలో తాము ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. ఐదేళ్లకు ఐదుగురు ప్రధాన మంత్రులని ప్రజలు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.
Also Read: బీజేపీకి 400 సీట్లు వస్తే, పీఎంగా అమిత్ షా, కమలనాధుల్లో చర్చ
సుస్థిర ప్రభుత్వం యోగ్యతలను సూచిస్తూ, మోదీ తమ ప్రభుత్వ విజయాలను, భారతదేశ స్థాయిని హైలైట్ చేశారు. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుందంటే అది తమ వల్ల కాదని, పౌరుల ఓటు వల్లేనని ప్రధాని అన్నారు. చంద్రుని ఉపరితలంపై ‘శివశక్తి’ పాయింట్ వద్ద అడుగుపెట్టామంటే అది పౌరుల ఓటు శక్తేనని అన్నారు.
ఇదిలా ఉంటే, OBCలో అన్ని ముస్లిం వర్గాలను చేర్చడంపై ప్రధాని మరోసారి కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు, “కాంగ్రెస్ కర్ణాటకలో OBC రిజర్వేషన్ను లాక్కొని ముస్లింలకు ఇచ్చింది. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చి దేశమంతటా ఈ పాలనను అమలు చేయాలని కోరుకుంటుంది కానీ సమాజ్ వాదీ పార్టీ వెనుకబడిన వర్గాలకు ద్రోహం జరిగినా దీనిపై మౌనంగా ఉంది” అని మోదీ మండిపడ్డారు.
Also Read: సీఏఏపై విపక్షాల అసత్య ప్రచారం, ఓటు బ్యాంకు కాదని నిర్లక్ష్యం: పీఎం మోదీ
उत्तर प्रदेश के प्रतापगढ़ के मेरे परिवारजनों का ये उत्साह साफ संकेत है कि इस चुनाव में भाजपा-एनडीए ऐतिहासिक जीत दर्ज करने जा रहा है।https://t.co/EsxgZYWOjU
— Narendra Modi (@narendramodi) May 16, 2024