Sukumar writings(Latest Tollywood News) : విరూపాక్ష సినిమా హిట్కి మెయిన్ రీజన్ క్లైమాక్స్. అదిరిపోయే సస్పెన్స్ అండ్ ట్విస్ట్తో సినిమాను ఓ రేంజ్కి తీసుకెళ్లారు. సినిమా చూస్తున్నంత సేపు.. విలన్ ఎవరనేది ఒక్కొక్కరు ఒక్కోలా గెస్ చేసేలా చేశారు. సినిమా చివరి వరకు విలన్ హీరోయినే అని తెలియకుండా బాగా లాక్కొచ్చారు. అసలు సినిమా స్టార్టింగ్లోనే హీరోయిన్ నల్ల కోడిని ఎత్తుకెళ్లినప్పుడే అనుమానించాల్సిందని ఇప్పుడు మీమ్స్ పెడుతున్నారు.
ఏదేమైనా ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ది కాదు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ది. సినిమా డైరెక్టర్ ఈ మధ్యే దీనికి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టాడు. ఈ సినిమాలో విలన్గా యాంకర్ శ్యామలను అనుకున్నాడు డైరెక్టర్. అయితే, ఆ క్యారెక్టర్ను విలన్ను చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదని చెప్పాడట సుక్కూ. హీరోయిన్నే విలన్ను చేస్తే ప్రేక్షకులు థ్రిల్ అండ్ సస్పెన్స్ ఫీల్ అవుతారని చెప్పుకొచ్చాడు. సుకుమార్ చెప్పిన తరువాత ఇక అందులో తిరుగేముంటుంది. ఆ లైన్ డైరెక్టర్తో పాటు హీరో, హీరోయిన్లకు నచ్చింది. దీంతో స్క్రిప్టులో భారీ మార్పులు చేసి, కొన్ని సీన్లను మళ్లీ రీషూట్ చేసి మరీ కథను, క్లైమాక్స్ను మార్చారు. దాని రిజల్ట్ సిల్వర్ స్క్రీన్పై అదిరిపోయింది.
ఒకవేళ యాంకర్ శ్యామలనే మెయిన్ విలన్ను చేసి ఉంటే.. అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. ఓస్.. ఈమెనా విలన్ అనుకుని బయటికి వచ్చేస్తారు తప్ప అంత ఎగ్జయిటింగ్గా ఫీల్ అవరు. హీరోయిన్ను విలన్ చేసి, అందులోనూ ప్రేమను మిక్స్ చేసే సరికి.. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు. ఇది కాకుండా వేరే ఏ క్లైమాక్స్ తీసినా సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. మొత్తానికి సుకుమార్ సరైన సమయంలో వేలు పెట్టి, గట్టి స్క్రీన్ ప్లే అందించి.. డైరెక్టర్కూ, ఇటు తేజ్కు, హీరోయిన్ సంయుక్తకు భారీ హిట్ ఇచ్చాడు. అన్నట్టు విరూపాక్ష డైరెక్టర్ .. సుక్కూ శిష్యుడే కావడంతో స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకున్నాడు.