SaiDharam Tej:74వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా దిల్ రాజు తన కొత్తగా స్టార్ట్ చేసిన బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రకటన చేశారు. అదేంటో తెలుసా!.. సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా ఓ మ్యూజికల్ వీడియోను చిత్రీకరిస్తున్నారు. సత్య పేరుతో రూపొందనున్న ఈ మ్యూజికల్ వీడియోలో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి నటించారు. చాన్నాళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న కలర్స్ స్వాతి మళ్లీ తెలుగు ప్రేక్షకులను సత్య అనే మ్యూజికల్ వీడియో ద్వారా పలకరించటానికి సిద్ధమైంది. దేశం కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న అమర జవాన్లకు నివాళిగా ఈ మ్యూజికల్ వీడియోను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన సైకలాజికల్ థ్రిల్లర్ విరూపాక్ష సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకు ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకుడు. సంయుక్తా మీనన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.