
IAF: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. శిక్షణలో ఉన్న రెండు యుద్ధ విమానాలు మొరెనా ప్రాంతంలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయయ్యాయి.
గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన సఖోయ్-30, మిరజ్ 2000 విమానాలు కొంతసమయానికి గాలిలో ఒకదానినొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కుప్పకూలగానే మంటలు చెలరేగడంతో రెండు విమానాలు కాలిపోయాయి. వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఒకరు మృతి చెందగా.. గాయపడిన ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు రాజస్థాన్లోని భరత్పూర్లో కూడా ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. వాయుసేనకు చెందిన సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ రెండు ఘటనలతో భారత వాయుసేనకు భారీగా నష్టం వాటిల్లింది.