Layoffs: మొన్నటి వరకూ ఐటీ జాబ్స్కు ఫుల్ డిమాండ్ ఉండే. కరోనా టైమ్లో ఎవరిని పడితే వారిని జాబుల్లోకి తీసుకున్నారు. పెద్ద పెద్ద జీతాలు ఇచ్చారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చోబెట్టి పని చేయించుకున్నారు. ఇప్పుడా ఎంజాయ్మెంట్ లేదు. ఆఫీసుకు తప్పకుండా రావాల్సిందేనని స్ట్రిక్ట్గా చెబుతున్నారు. అప్పట్లో తీసుకున్న ఎంప్లాయిస్ను ఇప్పుడు తీసుకుంటున్నారు. అంతర్జాతీయంగా రెసిషన్ అని, బ్యాంకులు దివాళా తీస్తుండటంతో బిజినెస్ తగ్గిందని.. ఏవేవో సాకులు చెబుతూ పని తక్కువ చేసే ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇస్తున్నాయి ఐటీ కంపెనీస్. లేటెస్ట్గా భారీ లేఆఫ్స్ ప్రకటించబోతోంది కాగ్నిజెంట్.
ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 3,500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది కాగ్నిజెంట్. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇవ్వనున్నట్టు చెబుతోంది. కొన్ని కార్యాలయాలను మూసివేయనుంది. 11 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ను వదులుకోనుంది.
అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ కంపెనీ.. ఇండియాలోనే ఎక్కువగా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కాగ్నిజెంట్లో 3,51,500 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 2 లక్షల వరకు భారత్లోనే జాబ్ చేస్తున్నారు.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట్ నికర లాభంలో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. 14.6 శాతం మార్జిన్ నమోదు చేసింది. మిగతా ఐటీ కంపెనీల రాబడితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ముందుముందు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా. అందుకే, ఖర్చు తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టిన కాగ్నిజెంట్.. 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భారత్ నుంచి ఎంతమంది ఉంటారోనని టెన్షన్ పడుతున్నారు మనోళ్లు. కొన్ని ఆఫీసులు సైతం మూసేయనుండటంతో.. చాలామంది జాబులే ఊడుతాయని అంటున్నారు.