E-Paper
Advertisement

RevanthReddy: ORRలోకి కేటీఆర్ బినామీ సంస్థలు!.. 2వేల ఎకరాలపై కన్ను!.. రేవంత్ సంచలన ఆరోపణలు..

RevanthReddy: ORRలోకి కేటీఆర్ బినామీ సంస్థలు!.. 2వేల ఎకరాలపై కన్ను!.. రేవంత్ సంచలన ఆరోపణలు..
Advertisement

RevanthReddy: సీఎం కేసీఆర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు ఆదాయాన్ని 30 ఏళ్లకు తనఖా పెట్టి 48 గంటల్లో 15వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ ఇప్పిస్తానన్నారు. ఈ స్విస్ ఛాలెంజ్‌కు ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. వేల కోట్ల స్కాం జరిగిందని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తుంటే.. ఎందుకు స్పందించడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్, HMDA కమిషనర్‌కు ప్రశ్నలు సంధించారు.

Advertisement

70 కోట్ల విలువగల ORRను 7380 కోట్లకు, 30 ఏళ్ల పాటు ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న కేసీఆర్.. తెలంగాణలో ORRను ఎట్లా ప్రైవేట్ పరం చేస్తారని నిలదీశారు రేవంత్‌రెడ్డి.

కేంద్ర హై వే అథారిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ORR లీజ్ ఉందని.. 30 ఏళ్ల పాటు లీజ్‌కు ఇవ్వడం రూల్స్‌కు విరుద్ధమని అన్నారు. 15 ఏళ్ల కంటే ఎక్కువ లీజ్ ఇవ్వకూడదని హైవే అథారిటీ చెబుతోందన్నారు.

Advertisement

బేస్ ప్రైజ్ నిర్ణయించుకుండా టెండర్ పిలుస్తారా? అని మండిపడ్డారు. టెండర్ పిలువక ముందు ORR.. hmda పరిధిలో ఉండేదని.. అలాంటిది హడావుడిగా ORRను GHMCకి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ORR కింద రెండు వేల ఎకరాల భూమి ఉందని.. కేటీఆర్ బినామీ సంస్థలు ORRలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రోజుకు రెండు కోట్ల చొప్పున.. ఏడాదికి 730 కోట్ల ఆదాయం వస్తోందని.. లోన్లు ఇచ్చేందుకు అన్ని బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని.. అలాంటి ORRను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని విమర్శించారు రేవంత్‌రెడ్డి.

ORR గోల్‌మాల్‌పై సెంట్రల్ విజిలెన్స్ అథారిటీకి, హోమ్ శాఖకు, CAGకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఓఆర్‌ఆర్ లీజులో కేసీఆర్ కుటుంబం ఎన్ని కోట్లు సంపాదించిందో బయటకు తీస్తామన్నారు పీసీసీ చీఫ్.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×