Chandrababu call to Chintamaneni: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో వాతావారణం వేడెక్కింది. అధికార వైసీపీకి ముందుగా అభ్యర్ధులను ప్రకటించడం, బీ ఫామ్ తీసుకోవడం, నామినేషన్లు వేయడం జరుగుతోంది. ఈ విషయంలో విపక్ష టీడీపీ కాస్త ఆలస్యంగా ఉంది. అయినా సరే నేతలు మాత్రం తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూపోతున్నారు. అయితే పొత్తుల కారణంగా చాలామంది నేతలకు టీడీపీ బీఫామ్ ఇవ్వడం ఆలస్యమైంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ బరిలో ఉన్నారు. అయితే పొత్తు కారణంగా దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. వీటికి అనపర్తి అభ్యర్థి ఎంపిక ముడిపడి ఉండడంతో బీ ఫామ్ ఇవ్వడం ఆలస్యమైంది. రెండురోజుల కిందట దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీ ఫామ్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించలేదు.
బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి చింతమనేనికి ఫోన్ రావడంతో వెంటనే శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. బీఫామ్ తీసుకోవాలని అధినేత చెప్పడంతో తన ప్రచారానికి విరామం
ఇచ్చి అక్కడికి బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి చింతమనేని దెందులూరుకు రానున్నారు. గురువారం బిఫామ్ను ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు.
ALSO READ: కంటతడి పెట్టిన బొత్స, కారణం అదేనా?
మరోవైపు అనపర్తి నుంచి బీజేపీ బరిలో ఉంది. అక్కడ కమలనాధులకు పెద్దగా బలం లేకపోవడంతో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చంద్రబాబు కన్వీన్స్ చేశారు. కూటమి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగినా ఒకటేనని చెప్పడంతో నల్లమిల్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దెందులూరు సీటుపై లైన్ క్లియర్ అయ్యింది.