Varmas Film on CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా కలిశారు. ఇద్దరి మధ్య సుధీర్ఘమైన చర్చలు జరిగాయి. వీరిద్దరి కలయిక ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు సీఎం జగన్కు అనుకూలంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి జగన్నాథ రథ చక్రాలు అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాయలసీమకు చెందిన ఓ పార్లమెంట్ మెంబర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని కూడా టాక్.
ఆర్జీవీకి ఎంతో సన్నిహితంగా ఉండే నిర్మాత నట్టి కుమార్.. ఈ విషయంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్కు అనుకూలంగా.. ప్రతి పక్షాలను విమర్శించేలా ఆర్జీవీ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని నట్టి కుమార్ అంటున్నారు. ఆయనకు తెలిసిన వివరాల మేరకు జగన్నాథ రథ చక్రాలు మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ నటుడు ఇందులో సీఎం జగన్ పాత్రను పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని నెలల ముందు సినిమా టికెట్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీరుని తప్పు పట్టిన ఆర్జీవీ ఇప్పుడు జగన్కు అనుకూలంగా సినిమా తీయడం కూడా చర్చనీయాంశంగా మారింది.