BigTV English
Advertisement

YCP Candidate Manhandling on Voter: పోలింగ్ బూత్ వద్ద దారుణం.. ఓటర్‌ని కొట్టిన వైసీపీ అభ్యర్థి శివకుమార్..!

YCP Candidate Manhandling on Voter:  పోలింగ్ బూత్ వద్ద దారుణం.. ఓటర్‌ని కొట్టిన వైసీపీ అభ్యర్థి శివకుమార్..!

YCP Candidate Manhandling to Voter: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొందరగా ఓటు వేసి ఇంటికి వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నారు ఓటర్లు. అయితే పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి. అంతేకాదు ఓటరు చెంప చెళ్లుమనిపించారు కూడా.


తాజాగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఆయన వెళ్లడం గమనించిన ఓటరు.. అభ్యంతరం వ్యక్తంచేశారు. పట్టరాని కోపంతో ఆయనపైకి దూసుకెళ్లారు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. అంతటితో ఆగకుండా ఓటరు చెంప చెళ్లుమనిపించారు.

అది చూసి షాకైన ఓటరు, ఆయనపైకి ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో అభ్యర్థి అనుచరులు ఓటరుని పోలింగ్ స్టేషన్ వద్దు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.


Also Read: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్, సంచలన వ్యాఖ్యలు

మరోవైపు హిందూపురం‌లోని చలమతూర్ మండలం హుసేన్‌పురం గ్రామంలో టీడీపీ నాయకుడు బాబు‌రెడ్డి పై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు.  దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక కొంతమంది ఓటర్లు భయంతో పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వాళ్లని చెదరగొట్టారు. సరైన సమయంలో పోలీసులు వచ్చారని లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు స్థానికులు.

Also Read: Chandrababu pawan in Varanasi: వారణాసిలో బాబు, పవన్, ఎన్డీయే నేతలతో భేటీ

Tags

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×