E-Paper
Advertisement

CM Revanth Reddy Casts Vote: కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

CM Revanth Reddy Casts Vote: కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!
Advertisement

Telangana CM Revanth Reddy Casts Vote In Kodangal: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అతని భార్య, కూతురు ఓటేశారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, కూతురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని., ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖయమని సీఎం అన్నారు. దేశంలో అబ్ కీ బార్ 400 అంటున్నారు.. 336 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి 400 సీట్లు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని అన్నారు.

Advertisement

దేశంలోమ మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి పేరుతో ప్రజలను తాము ఓట్లు అడుగుతుంటే బీజేపీ మాత్రం మోదీ పేరుతో ఓట్లు అడుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ప్రశ్నించారు సీఎం. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. రైతు బంధు ఎలా ఇచ్చామో.. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Also Read: Voters: హైదరాబాద్ బాట పట్టిన ఓటర్లు.. రహదారుల్లో వాహనాల రద్దీ

Advertisement

కేసీఆర్ పై తనకు సానుభూతి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారన్నారు సీఎం. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Related News

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×