Intinti Ramayanam : బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి. ఇది ప్రముఖ తెలుగు ఎంటర్టైమెంట్ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి రోజురోజుకీ ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారన్న విషయం తెలిసిందే. జనాలని ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ కావడంతో దీన్ని చూసేందుకు కూడా జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అయితే ఈ సీరియల్ లవర్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ ని టీం అనౌన్స్ చేసింది. అవనితో కలిసి నటించాలనుకునే వారికోసం సూపర్ న్యూస్ మీకోసం తీసుకుని వచ్చాము. ఈ సినిమాలో నటీనటులుగా మీ కెరియర్ నీ కొనసాగించాలనుకునే వారికి బంఫర్ ఆఫర్.. ఈ సీరియల్ లో నటించే నటీనటుల కోసం మేకర్స్ఆడిషన్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.. మరి ఆ ఆడిషన్స్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
చాలామంది ఈ సీరియల్ లో నటించాలి అనుకుంటున్నారు.. అలాంటివారికి ఇది సువర్ణ అవకాశం.. ఈ సీరియల్ లో నటించాలనుకునే వారు అడిషన్స్ కు రావచ్చు అని ఓ ప్రకటనను సీరియల్ టీమ్ రిలీజ్ చేసింది.. ఒక పోస్టర్ ను వదిలింది.. అందులో ఏముందంటే.. ఇంటింటి రామాయణం సీరియల్ కాస్టింగ్ కాల్.. ఈ సీరియల్లో నటించేందుకు నటీనటులు కావలెను.. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఇక్కడ తెలిపిన ఒక మొబైల్ నెంబర్ కు పూర్తి వివరాలను, అలాగే మీ ప్రొఫైల్ ను వాట్సాప్ చెయ్యాల్సిందిగా కోరుతున్నాం అని ప్రకటించారు.. అంతేకాదు ఈ సీరియల్ కు ఏ వయసు వాళ్లు కావాలో కూడా పేర్కొన్నారు. ఈ సీరియల్ లో నటించాలని అనుకునేవారు వాట్సప్ చేయవచ్చు. మరి ముఖ్యంగా ఎటువంటి అనుభవం లేనివారికి అయితే ఇది మంచి అవకాశం అంటూ ఇంటింటి రామాయణం సీరియల్ టీం రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఒకసారి దీని గురించి చూసేయండి..
ఇక ఇంటింటి రామాయణం ప్రస్తుతం సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ఆస్తులని తన పిల్లల పేరు మీద పంచుతాడు. అయితే తన బిడ్డలలో ఎవరికీ ముందుగా బిడ్డలు పుడతారో వాళ్లకు మాత్రమే ఆస్తులు దక్కుతాయని కండిషన్ తో ఆస్తి పంపకాలు చేస్తాడు.. పల్లవి మాత్రం తనకి ఇంకా బిడ్డ పుట్టలేదు తన భర్త తనకి దగ్గరికి తీసుకుంటేనే కదా.. పిల్లలు పుట్టేది అని కండిషన్ పెడుతుంది. చివరికి తన నాలుగు గోడల కాపురాన్ని నలుగురిలో పెట్టి తన భర్తని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక చివరికి వాళ్ల సొంత ఇంటికి అందరూ వెళ్ళిపోతారు.. మళ్లీ ఆస్తులు తిరిగి రావడం ఇంటికి రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే సత్యనారాయణ వ్రతాన్ని పూర్తి చేస్తారు.. ఇంతవరకు బాగానే ఉంది అని అనుకునే లోపల పల్లవి జీవితంలోకి అనుకొని వ్యక్తి ఎంటర్ అవుతాడు.. గతంలో పల్లవి వల్ల అతని జీవితం నాశనం అయిందని తెలుస్తుంది. మరి అతను పల్లవి పై తన పగని ఎలా తీర్చుకుంటాడు అన్నది ప్రస్తుతం సస్టెన్స్ గా మారింది.. ఇవాళ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాల్సిందే..