E-Paper
Advertisement

గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో.. భారీ వర్షంలో ఈ రంగుల అలర్ట్స్ ఎందుకిస్తారు? దీని వెనకున్న లెక్కలేంటి?

గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో.. భారీ వర్షంలో ఈ రంగుల అలర్ట్స్ ఎందుకిస్తారు? దీని వెనకున్న లెక్కలేంటి?
Advertisement

Weather Color Alerts: ప్రకృతి ప్రకోపించినప్పుడు ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవడానికి వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలే ఈ ‘కలర్ కోడెడ్ అలర్ట్స్’. ఆకాశం మేఘావృతమై, భారీ వర్షాలు కురుస్తాయని ముందే ఊహించి, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ రంగులను వాడుతుంటారు. అసలు ఈ అలర్ట్స్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, ఏ ప్రాతిపదికన వీటిని ఇస్తారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఈ అలర్ట్స్ వెనుక ఉద్దేశం ఏంటి?

వాతావరణంలో వచ్చే తీవ్రమైన మార్పుల వల్ల ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడటమే ఈ అలర్ట్స్ ముఖ్య ఉద్దేశం. కేవలం వర్షాలే కాదు.. ఎండ తీవ్రత (హీట్ వేవ్స్), చలిగాలులు, తుపాన్లు వచ్చినప్పుడు కూడా భారత వాతావరణ శాఖ (IMD) ఈ రంగుల హెచ్చరికలను జారీ చేస్తుంది. ప్రమాదం తీవ్రతను బట్టి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సులభంగా అర్థం కావడానికి ఈ కలర్ కోడింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు.

ఏ రంగు అలర్ట్ దేనికి సంకేతం?

Advertisement

ప్రాథమికంగా వాతావరణ శాఖ నాలుగు రకాల రంగులను ఉపయోగిస్తుంది. రంగును బట్టి వాటి తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

గ్రీన్ అలర్ట్ (పచ్చ రంగు)

దీని అర్థం వాతావరణం సాధారణంగానే ఉంటుంది. ఇకపై ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేందుకు అధికారులు దీనిని జారీ చేస్తుంటారు. ఇది జారీ చేసినప్పుడు ప్రజలు తమ పనులను ఎంచక్కా చేసుకోవచ్చు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పడానికి ఇది సంకేతం.

ఎల్లో అలర్ట్ (పసుపు రంగు)

Advertisement

రాబోయే కొన్ని రోజుల్లో వాతావరణం మారే అవకాశం ఉందని, భారీ వర్షాలు పడొచ్చని చెప్పడానికి దీన్ని ఇస్తారు. ఇది ఒక రకమైన ముందస్తు హెచ్చరిక లాంటిది. ‘పరిస్థితిని గమనిస్తూ ఉండండి, అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి’ అని ఈ సిగ్నల్ అర్థం.

ఆరెంజ్ అలర్ట్ (నారింజ రంగు)

వాతావరణం మరింత క్షీణించి, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు దీన్ని జారీ చేస్తారు. దీనివల్ల రోడ్లు బ్లాక్ అవ్వడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడం వంటివి జరుగుతాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని దీని అర్థం.

రెడ్ అలర్ట్ (ఎరుపు రంగు)

ఇది అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ ఇస్తారు. ఈ అలర్ట్ జారీ చేసినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగాలని ఈ అలర్ట్ హెచ్చరిస్తుంది.

ఏ ప్రాతిపదికపై ఈ అలర్ట్స్ ఇస్తారు?

ప్రధానంగా ఈ కలర్ అలర్ట్స్ ను వాతావరణ శాఖ ఇస్తుంది. అయితే కేవలం వర్షం పరిమాణాన్ని బట్టే కాకుండా అనేక సాంకేతిక, భౌగోళిక అంశాలను విశ్లేషించి వీటిని జారీ చేస్తుంది. అవి ఏంటంటే..

వర్షపాతం తీవ్రత

24 గంటల్లో ఎంత మిల్లీమీటర్ల వర్షం పడొచ్చు అనేదానిపై ప్రధానంగా ఆధారపడి కలర్ అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేస్తుంది. ఉదాహరణకు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటే ‘రెడ్ అలర్ట్’ ఇస్తారు.

ప్రాంతం – భౌగోళిక పరిస్థితి

ఒకే రకమైన వర్షం ఉన్నప్పటికీ.. ప్రాంతాన్ని బట్టి ఈ అలర్ట్స్ మారుతూ ఉండొచ్చు. మైదాన ప్రాంతాల్లో పడే వర్షం, కొండ ప్రాంతాల్లో పడే వర్షం ఒకేలా ఉన్నప్పటికీ.. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి.. మైదన ప్రాంతాలకు సాధారణ ఎల్లో అలర్ట్ ఇచ్చి.. కొండ ప్రాంతాలకు మాత్రం ఒక్కోసారి అరంజ్, రెడ్ అలర్ట్స్ ను వాతావరణశాఖ జారీ చేస్తుంటుంది.

గాలి వేగం, ఉపగ్రహాల డేటా

రాడార్లు, ఉపగ్రహాల (Satellites) ద్వారా వచ్చే డేటాను కూడా ఈ అలర్ట్ జారీకి పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా గాలిలోని తేమను, మబ్బుల సాంద్రతను శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షించి.. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు.

గత అనుభవాలు దృష్ట్యా

వాతావరణశాఖ గత అనుభవాలను సైతం పరిగణలోకి తీసుకొని.. ఈ అలర్ట్స్ ను జారీ చేస్తుంటుంది. పడబోయే వర్షాన్ని ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ తట్టుకోగలదా? వరదలు వచ్చే ఛాన్స్ ఉందా? అనే ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (Impact Assessment) ఆధారంగా కూడా ఈ రంగులను ఖరారు చేస్తారు.

Also Read: చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్.. జియో రూ. 349 vs వీఐ రూ. 449.. ఏది బెస్ట్ అంటే?

అలర్ట్స్‌ అప్ గ్రేడ్స్

మెుత్తంగా చెప్పాలంటే.. వాతావరణం అనేది ఎప్పటికప్పుడు మార్పునకు లోనయ్యే ప్రక్రియ. అందుకే శాస్త్రవేత్తలు శాటిలైట్ డేటాను బట్టి ఎల్లో అలర్ట్‌ను ఆరెంజ్‌గా, ఆరెంజ్‌ను రెడ్‌గా మారుస్తూ అప్‌డేట్స్ ఇస్తుంటారు. కాబట్టి వర్షాకాలంలో ఈ అలర్ట్స్‌ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:ప్రపంచంలోనే తొలిసాలి.. రోబోలతో లైవ్ సర్జరీ.. ఆపరేషన్ సూపర్ సక్సెస్!

Related News

రూ. 999 కే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. బెనిఫిట్స్ కొట్టేయండి!

చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్.. జియో రూ. 349 vs వీఐ రూ. 449.. ఏది బెస్ట్ అంటే?

ప్రపంచంలోనే తొలిసాలి.. రోబోలతో లైవ్ సర్జరీ.. ఆపరేషన్ సూపర్ సక్సెస్!

మొబైల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి.. ఫస్ట్ కాల్ ఎవరికి చేశాడో తెలుసా? ఊర మాస్, అస్సలు ఊహించలేరు

హైదరాబాద్‌లో భారీ ఆపరేషన్.. 1100 మంది పోలీసులతో.. ఇళ్లల్లో సోదాలు!

BSNL మహా అద్భుతం.. ఏకంగా రూ.1.34 లక్షల ఫోన్ లాంచ్.. ప్రత్యేకత తెలిస్తే ఫ్యూజులు ఔట్!

బేస్‌మెంట్‌లు, లిఫ్టుల్లో నెట్‌వర్క్ ఎందుకు పనిచేయదు? అసలు నిజం ఇదీ!

Big Stories

Advertisement
×