Yoga Mahotsav 2023 Hyderabad(Telangana today news): జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. 25 రోజుల కౌంట్ డౌన్తో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం మార్చి 13 నుంచి 100 రోజులపాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే చివరి 25 రోజుల కౌంట్డౌన్కి సూచికగా హైదరాబాద్ పరేడ్గ్రౌండ్స్లో యోగా మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు.. కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, ముంజపరా మహేంద్రభాయ్ కాళూభాయ్ పాల్గొన్నారు.
అంతకుముందు 100 రోజుల కౌంట్డౌన్ ఈవెంట్ న్యూఢిల్లీలో, 75 రోజుల మహోత్సవం అసోమ్లోని దిబ్రూఘర్లో, 50వ రోజు కౌంట్డౌన్ జైపూర్లో జరిగింది.