BigTV English

TDP Mahanadu: మహానాడులో లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ.. పసుపు పండుగ షురూ..

TDP Mahanadu: మహానాడులో లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ.. పసుపు పండుగ షురూ..
nara lokesh mahanadu

TDP Mahanadu Meeting(AP Political News): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. రాజమండ్రిలో పసుపు పండుగ మొదలైంది. టీడీపీ మహానాడుకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


యువగళం పాదయాత్రకు నారా లోకేష్ విరామం ప్రకటించి.. మహానాడుకు హాజరయ్యారు. తొలుత గుంటూరు పార్లమెంట్ ప్రతినిధిగా నమోదు చేయించుకున్నారు. వేదికపై ఆశీనులైన ప్రతి ఒక్కరినీ పలకరించారు లోకేష్. కార్యకర్తలకు అభివాదం చేశారాయన.

రాజమహేంద్రవరం పసుపు రంగు పులుముకుంది. టీడీపీ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయంటున్న టీడీపీ.. రాజమండ్రి మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేసింది.


తొలిరోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. 21 తీర్మానాలపై చర్చించనున్నారు. వాటికి ఆమోదం తెలుపుతారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై డిజిటల్ ప్రదర్శన ఉంటుంది.

ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తారు. 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×