Big Stories

CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Speech: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఆసిఫాబాద్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు.

- Advertisement -

ఆదిలాబాద్ రైతుల పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని అన్నారు. బీజేపీ మంత్రి వర్గంలో గోండులకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు గోండులు, లంబాడాల హక్కులను కాపాడలేదని అన్నారు. ఇంత వరకూ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ మహిళకు ఏ పార్టీ ఇవ్వలేదని అన్నారు. తొలి సారి మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు.

- Advertisement -

Also Read: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో న్యూట్విస్ట్, ముగ్గురు అరెస్ట్

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తాను రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడితే అమిత్ షా కేసు పెట్టించారని తెలిపారు. ఢిల్లీ సుల్తాన్ లు తెలంగాణపై దాడి చేయాలని చూస్తున్నారని.. బీజేపీ ఆటలు సాగవని సీఎం స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News