PM Modi Said Congress Party Trying to Divide Hindu Society: హిందూ సమాజాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. గుజరాత్ జామ్నగర్ లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వ్యూహాలతో పోటీ చేస్తుందని మోదీ అన్నారు.
కూలాల ఆధారంగా సమాజాన్ని విభజించడం ఒకటైతే..రెండోది బుజ్జగింపు రాజకీయాలని ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు. రాముడు, శివ భక్తుల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. భారత దేశ ఆచార వ్యవహారాలు వేల ఏళ్లుగా కొనసాగుతున్నాయని.. మొగలులు కూడా వాటిని విచ్ఛిన్నం చేయలేక పోయారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు వాటిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శక్తిని ధ్వంసం చేస్తానని అన్నారని గుర్తు చేశారు. తామంతా శక్తిని ప్రార్థిస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును తాము ప్రజలకు తెలపడంతోనే..కాంగ్రెస్ నేతలు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: ప్రజ్వల్ రేవణ్ణపై మరో కేసు.. గ్లోబల్ లుకౌట్ నోటీసులు జారీ..
#WATCH | Gujarat: Addressing a public rally in Jamnagar, PM Narendra Modi says, "Congress is contesting these elections on two strategies. First, dividing society based on caste. Second, uniting their vote bank through politics of appeasement… Congress is now giving its all to… pic.twitter.com/8AQyg88zWs
— ANI (@ANI) May 2, 2024