E-Paper
Advertisement

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు
Advertisement

Tirumala: ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.

 

టీటీడీలో ఏసీబీకి చిక్కి భారీ తిమింగలం

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. డిప్యూటీ ఈవో లోకనాథంను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఈ ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు, ప్రస్తుతం విచారిస్తున్నారు.

సాయంత్రం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు. సోదాల సమయంలో లోకనాథం ఇంట్లో భారీ ఎత్తున విలువైన ఆస్తులు ఏసీబీకి చిక్కాయి. అందులో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిపై సోదాల వెనుక కల్తీ నెయ్యి కేసులో చిన్న అప్పన్న విచారణలో సేకరించిన ఆధారాలతో లోకనాథంపై కేసు నమోదు చేశారు.

Advertisement

 

డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

లోకనాథం, ఆయన కొడుకు పేరిట నాలుగు ఫిక్స్ డ్ డిపాజిట్లను గుర్తించారు. తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఫ్లాట్, గొల్లవానిగుంటలో రెండు ఇల్లు, వడమాలపేట మండలం పాదిరేడులో ఇల్లు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దాదాపు 24 గంటలపాటు లోకనాథంతోపాటు, ఆయన బంధువుల ఇళ్లలో సోదారు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులున్నట్లు గుర్తించారు.

మొత్తం ఏసీబీ అధికారులు ఏడు బృందాలు విడిపోయి ఐదు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఆయనకు ఐదు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లు ఈ సోదాల్లో గుర్తించారు. మార్కెట్ విలువ అయితే రూ. 20 కోట్ల వరకు ఉండవచ్చని అంటున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే కల్తీనెయ్యి కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు టీటీడీలో అప్పుడే చర్చ మొదలైంది.

ALSO READ: ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్,

Related News

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×