E-Paper
Advertisement

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!
Advertisement

Fake Swami: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ ఫేక స్వామీజీ బండారం బట్టబయలైంది. సంతాన ప్రాప్తి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తానంటూ నమ్మించి అమాయకులైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగ దంపతుల వద్ద దాదాపుగా రెండు కోట్లకు పైగా డబ్బు కాజేసిన సంఘటన కలకలం రేపుతుంది.

ఆశ్రమం ముసుగులో దందా..

ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని మేళ్ళచెరువు సమీపంలో నైమిసారణ్యం ఆశ్రమం నిర్వహిస్తూ రమణ పొలకల స్వామి అలియాస్ రమణానంద మహర్షి అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడినట్టు దంపతులు పేర్కోన్నారు. అయితే బెంగళూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు శ్యామల, ఆనంద దంపతులకు పదేళ్లుగా సంతానం లేదు. దీంతో దీన్ని ఆసరగా చేసుని దందాకు తెరలేసినట్టు దంపతులు పేర్కోన్నారు. మధ్యవర్తులైన శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి అనే వ్యక్తులు స్వామీజీ చాలా శక్తిమంతుడని ఈయన వద్దకు వెలితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని దంపతులను నమ్మించారు.

Advertisement

Also read: ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

రూ. 2 కోట్లకు పైగా వసూలు..

మంచి జరగడం కోసం కొన్ని హోమాలు, ప్రత్యేక పూజలు, వాస్తు దోషాలు, డైట్ ప్లాన్ల పేరుతో స్వామీజీ విడతల వారీగా భాదితుల నుండి భారీగా నగదును గుంజాడు. అంతటితో ఆగకుండా వారితో త్రీబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను సైతం అమ్మించి దాదాపు 800 గ్రాముల బంగారాన్ని కాజేసాడు. దీంతో మోత్తం ఆ దంపతులు వద్ద రూ. 2 కోట్ల 17 లక్షల వరకు వసూలు చేసాడని భాదితులు వాపోయారు.

అడిగితే బెదిరింపులు..

Advertisement

అయితే వారి సమస్య తీరక పోవడంతో పాటు, భాదితుని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడం, తనకు మరోసారి గర్భస్రావం జరగడంతో మోసపోయామని దంపతులు గ్రహించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తమ ఆస్తులు, నగదు వెనక్కి ఇవ్వాలని కోరితే స్వామీజీ వారిని అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు దంపతులు తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరతున్నారు. భాద్యులపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Also read: మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Tags

Related News

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

రైలు ప్రయాణికులకు గమనిక.. కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్, రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

Advertisement
×