E-Paper
Advertisement

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?
Advertisement

Amaravati: ఏపీలో రాజకీయాలు వెరైటీగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏం చేసినా, టీడీపీకి క్రెడిట్ ఇవ్వడానికి వైసీపీ అస్సలు అంగీకరించలేదు. దాని క్రెడిట్ అంతా మాదేనని, లేకుంటే మా నాన్న చేశారంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలు వెలిగొండ ప్రాజెక్టు, ఉత్తరాంధ్రకు గోదావరి వాటర్ విషయంలోనూ అదే చేసింది. క్రెడిట్ చోరీ విషయంలో సీఎం చంద్రబాబు ఏమన్నారు?

ఏపీలో క్రెడిట్ చోరీ రాజకీయాలు తీవ్రం

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు ఇచ్చిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు వైసీపీ తీరుని ఎండగడుతూనే, క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. డేటా సెంటర్ మేమే తెచ్చాం.. భోగాపురం ఎయిర్‌పోర్టు మేమే కట్టామని వైసీపీ చెబుతోందని, అందరూ ఎగతాళి చేస్తే చివరకు రిప్లై ఇవ్వకుండా నేతలు సైలెంట్ అయ్యారని దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగం మేమే తవ్వామని అన్నారని, చివరకు అక్కడి ప్రజలు వాళ్లని ఛీకొట్టే పరిస్థితి వచ్చిందన్నారు.

Advertisement

 

ఉత్తరాంధ్రకు గోదావరి జలాల క్రెడిట్ మాదేనన్న జగన్

ఇప్పుడు అనకాపల్లికి గోదావరి నీళ్లు తెచ్చామని, ఇది కూడా మేమే చేశామని పేటీఎం సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రారంభిస్తారని వివరించారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగానే ఈసారి నేరుగా రంగంలోకి జగన్ దిగేశారు. ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పురుషోత్తపట్నం పంపులతో నీళ్లు ఎత్తి పోలవరం నీళ్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పురుషోత్తపట్నం పంపులు.. పోలవరం ఎడమ కాలువ ఇప్పటికే ఉన్నాయన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు 79 శాతం వైఎస్ హయాంలో పూర్తి అయ్యాయని చెబుతూ నాన్న ఖాతాలో క్రెడిట్ వేసే ప్రయత్నం చేశారు మాజీ సీఎం.

ALSO READ: ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Advertisement

ఏం చేయకుండానే ప్రాజెక్టులకు క్రెడిట్ తీసుకొంటున్నారని, సాగునీటి ప్రాజెక్టులపై వరుసగా పబ్లిసిటీ ఈవెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. చివరకు పోలవరం ఎత్తు విషయాన్ని తెరపైకి తెచ్చారు మాజీ ముఖ్యమంత్రి. పోలవరం ఎత్తు 45.72 మీటర్లయితే నీటి నిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారని అన్నారు. కేంద్రం 41.15 మీటర్ల వరకు నిధులిస్తామని చెబుతోందని, పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? కొత్త మెలిక పెట్టే ప్రయత్నం చేశారు. పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ మాటేంటి? నిర్వాసితులకు ప్యాకేజీ? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు మాజీ సీఎం జగన్. రాబోయే రోజుల్లో దీనిపై సీఎం చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వెయిట్ అండ్ సీ.

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

Big Stories

Advertisement
×