E-Paper
Advertisement

Earth Quake : ఇండోనేషియాలో భారీ భూకంపం

Earth Quake : ఇండోనేషియాలో భారీ భూకంపం
Advertisement

Earth Quake : వరుస భూకంపాలతో ఆగ్నేయ ఆసియా ద్వీప దేశమైన ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. బండా సముద్రంలో ఈ భూకంపం వచ్చినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా.. ఈ భూకంపం కారణంగా ఎంతమేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న వివరాలు తెలియలేదు.

ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీలు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. దీనికన్నా ముందు.. బుధవారం ఉదయం 11.53 నిమిషాలకు తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో.. ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇండోనేషియా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటంతో.. భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సముద్రంలో తరచూ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతుండటం వల్ల కూడా ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తాయి. 2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలోనే లక్ష 70 వేలమంది చనిపోయారు. శ్రీలంక, ఇండియాలతో కలిపి మొత్తం 2 లక్షల 20 వేల మంది మరణించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×