E-Paper
Advertisement

Earth Quake : ఇండోనేషియాలో భారీ భూకంపం

Earth Quake : ఇండోనేషియాలో భారీ భూకంపం

Earth Quake : వరుస భూకంపాలతో ఆగ్నేయ ఆసియా ద్వీప దేశమైన ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. బండా సముద్రంలో ఈ భూకంపం వచ్చినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా.. ఈ భూకంపం కారణంగా ఎంతమేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న వివరాలు తెలియలేదు.

ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీలు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. దీనికన్నా ముందు.. బుధవారం ఉదయం 11.53 నిమిషాలకు తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో.. ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇండోనేషియా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటంతో.. భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సముద్రంలో తరచూ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతుండటం వల్ల కూడా ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తాయి. 2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలోనే లక్ష 70 వేలమంది చనిపోయారు. శ్రీలంక, ఇండియాలతో కలిపి మొత్తం 2 లక్షల 20 వేల మంది మరణించారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×