Tripti Dimri:ఒక్కో సినిమా కొందరు నటీ నటుల్ని ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్గా చేస్తాయి.

అందులో ముందు వరుసలో ఉంటుంది నటి త్రిప్తి డిమ్రి.

ఈ అందాల బ్యూటీ 2017లో పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది.

ఆ తర్వత బాలీవుడ్లో హీరోయిన్గా సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది.

ఆపై 2018లో లైలా మజ్నులో తొలిసారి ప్రధాన పాత్రలో నటించి అలరించింది.

ఇక రీసెంట్గా రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన యానిమల్ సినిమాలో నటించింది.

ఈ సినిమాతో త్రిప్తి డిమ్రి కెరీర్ మారిపోయింది.

ఈ సినిమాలో ఆమె అందం, నటనకు సినీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూ.. మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది.

ఈ బ్యూటీ తన అందంతోనే వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు వార్ 2 మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్కి జోడీగానా లేక హృతిక్ రోషన్కు జోడీగానా అనేది తెలియాల్సి ఉంది.