Godhavari Janu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి.. ఈమధ్య కొత్త సీరియల్ ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గత రెండు నెలల్లోనే దాదాపు మూడు సీరియల్స్ ప్రారంభమయ్యాయి.. అయితే ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన ప్రతి సీరియల్ కూడా జనాలకి మంచిగా అలరిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న గోదావరి సీరియల్ రోజురోజుకీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న జాను గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు.. తాజాగా జాను గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈమె ఈ సీరియల్ నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది. అసలు నిజంగానే జాను సీరియల్ నుంచి తప్పకుంటుందా? ఏం జరిగింది? ఎందుకు ఆమె సీరియల్ కి దూరమవుతుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న లేటెస్ట్ సూపర్ హిట్ సీరియల్స్ లో గోదావరి సీరియల్ కూడా ఒకటి.. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ స్టోరీ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. మంచితనం మోసం చేస్తే ఒక కుటుంబం రోడ్డున పడుతుంది అని ఈ సీరియల్ చూపించింది.. ఇందులో కుటుంబ పెద్ద చేసిన పనికి ఆ ఇంట్లోనే వాళ్ళందరూ కూడా శిక్షణ అనుభవిస్తుంటారు. నలుగురు అమ్మాయిలు ఉన్న ఒక ఇంటిని ఒక అమ్మాయి ఎలా నెట్టుకుంటూ వస్తుంది అన్న స్టోరీ తో ఈ సీరియల్ వచ్చింది. ఇందులో హీరోయిన్ గా జాహ్నవి నటించింది. ఆమె అసలు పేరు అనుమిత దత్త.. ఈమె తెలుగు అమ్మాయి కాదు. బెంగాలీ నుంచి వచ్చిన హీరోయిన్. గతంలో ఈమె నువ్వుంటే నా జతగా సీరియల్ నటించింది. అయితే ఇప్పుడు ఈమెకు బెంగాల్లో సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని సమాచారం.. మంచి ఆఫర్స్ తో సినిమాలు రావడంతో సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ అవుతుంది. ఏది ఏమైనా కూడా సీరియల్ ప్రారంభమైన కొద్ది రోజులనే హీరోయిన్ వెళ్లిపోవడం అనేది జనాలని ఆలోచనలో పడేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..
గోదావరి సీరియల్ హీరోయిన్ జాహ్నవి అసలు పేరు అనుమితా దత్త.. ఈమె గతంలో తెలుగులో నువ్వుంటే నా జతగా సీరియల్ లో నటించింది. ఆ సీరియల్లో ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అనుమిత సీరియల్లో చీర కట్టుకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో గోదావరి సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె రియల్ లైఫ్ గురించి అలాగే ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేసిన విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. సీరియల్స్లలో అలాగే సినిమాలలో అవకాశాలు రావడంతో జాబు ని వదిలేసినట్లు కూడా బయటపెట్టింది. ఇకపోతే ఏమైనారెమ్యూనరరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో సీరియల్ కి ఈయన దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటుంది అని సమాచారం. ప్రతి నెల లక్షలు ని సంపాదిస్తూ బిజీగా ఉంటుంది..
Also Read:సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?