నోయిడాలో పుట్టి పెరిగింది మేధా శంకర్. ఫాషన్ మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసి, మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఎఫ్ బీబి ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లో మెరిసింది.
ఈ బ్యూటీ సితార్, హార్మోనియం, కీబోర్డు ప్లే చేయగలదు.
నటనపై ఉన్న ఆశక్తితో ముంబయికి మకాం మార్చింది. “విత్ యు ఫర్ యు ఆల్వేజ్” అనే లఘు చిత్రంతో నటించింది.
బ్రిటీష్ సిరీస్ బీకమ్ హౌజ్(2019), మరో సిరీస్ దిల్ బేకరార్(2021) లో కీలక పాత్రలు పోషించింది ఈ ముద్దుగుమ్మ.
శాదీస్తాన్ (2021) తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఆ సినిమాలో అర్షి మోదీగా ఆకట్టుకుంది.
2022 లో వచ్చిన మ్యాక్స్, “మిస్ అండ్ మ్యూజకీ” లో బాయ్ ఫ్రెండ్ ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను ఆకట్టుకుంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్ట్ వల్ లో ప్రదర్శితమవడం విశేషం.
ఆ తర్వాత 12th ఫెయిల్ లో శ్రద్ధా జోషీగా నటించి మంచి గుర్తింపుపొందింది. ఆ సినిమాలో బోలో నా పాటును పాడి అలరించింది కూడా.
ఈ సినిమా విడుదలకు ముందు 16 వేల ఫోలోవర్స్ కలిగి ఉన్న తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా.. విడుదల తర్వాత 20 లక్షల ఫాలోవర్స్ కి చేరుకుంది. దీంతో మేధా ఎంతగా మాయ చేసిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధ.. ఆత్మవిశ్వాసంతో , పట్టుదలతో ఉంటేనే ఏదైనా సాధించగలం అని ఓ ఇంటర్వూలో పేర్కొంది.