E-Paper
Advertisement

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..
Telangana Government
Telangana Chief Secretary Shanthi Kumari

Telangana Government: తాగు నీటి సరఫరా పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో తాగు నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సరఫరా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని. జులై చివరి వారం వరకు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదని ఆదేశించింది.

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జివన్ పాటిల్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కృష్ణాదిత్యా, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆర్ వి కర్ణన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనితా రామచంద్రన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు శరత్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు విజేంద్ర, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు శృతి ఓఝా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు బి. గోపీ, ఉమ్మడి మెదక్ జిల్లాకు భారతీ హోలీకేరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్ర మోహన్‌ను నియమిస్తూ తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Telangana Government

Tags

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×