E-Paper
Advertisement

Medaram Jatara 2024: వన దేవతల్ని దర్శించుకున్న 1. 45 కోట్ల మంది భక్తులు

Medaram Jatara 2024: వన దేవతల్ని దర్శించుకున్న 1. 45 కోట్ల మంది భక్తులు
Advertisement

medarm jathara

Sammakka Saralamma Jatara 2024: ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది దర్శించుకున్నారంటే మామూలు విషయం కాదు. మేడారం జనసంద్రాన్ని తలపించింది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం.. జాతర నాలుగురోజులు పూజలందుకున్న వన దేవతలు.. శనివారం సాయంత్రం వనప్రవేశం చేయడంతో మహాజాతర ముగిసింది. ఈ నేపథ్యంలో మేడారం నుంచి హుండీలను హన్మకొండలోని టీటీడి కళ్యాణమండపానికి తరలించనున్నారు. అక్కడ దేవదాయ శాఖ అధికారులు ఆదాయాన్ని లెక్కిస్తారు.

Advertisement

మేడారంలోని మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేసారు. ఫిబ్రవరి 29 నుంచి మేడారం హుండీలు లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో పది రోజులు పాటు హుండీల లెక్కింపునకు కసరత్తు ప్రారంభం కానుంది. ఈ మహాజాతరకు రెండునెలల ముందే మేడారాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సంఖ్యలో సందర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మేడారం జాతర నాలుగు రోజుల్లో 1.45 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

గతేడాది 2022 జాతర సందర్భంగా 11.44 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోలు భక్తులు సమర్పించారు. అయితే 2020 లో మాత్రం భక్తుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. కానీ ఈ ఏడాది మాత్రం 2022 జాతరకు మించి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సారి రెండు నెలల ముందే మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు రాక మొదలైంది. ఆదివారం కూడా లక్షల్లో భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేశారు. దీంతో ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు

Tags

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×