E-Paper
Advertisement

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త
Advertisement

Warangal Incident:ఈ మధ్య కాలంలో భర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్న కామెంట్లు వింటూనే ఉన్నాం. ఐదేళ్లలో 700 కి పైగా.. భర్తలను భార్యలు హతమార్చినట్టు చెబుతున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్.. ఈ నేపథ్యంలో మరో భర్త తన భార్య వల్ల ప్రాణ హాని ఉందంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.  వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం జగ్గుతండాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ‘నా భార్య నుంచి ప్రాణహాని ఉంది’ అంటూ భర్త బానోతు మహేశ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తన భార్య శాంత అక్రమ సంబంధం పెట్టుకుని, ప్రియుడు దేవేందర్‌తో కలిసి తనను చంపేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ మహేశ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన వివరాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

బానోతు మహేశ్, శాంతకు 16 ఏళ్ల క్రితం వివాహం.. ఒక కొడుకు రాజేష్(14)
మహేశ్, శాంతల వివాహం 16 సంవత్సరాల క్రితం జరిగింది. వీరికి రాజేష్ (14) అనే కుమారుడు ఉన్నాడు. జగ్గుతండా గ్రామంలో నివసిస్తున్న మహేశ్ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా శాంతకు అదే గ్రామానికి చెందిన దేవేందర్ అనే ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మహేశ్‌కు తెలిసి, అతడు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. పంచాయతీలో దేవేందర్‌కు జరిమానా విధించారు. అప్పటి నుంచి శాంత, దేవేందర్ మహేశ్‌పై కక్ష సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు మహేశ్ ఆరోపిస్తున్నాడు.

Advertisement

తల్లదండ్రుల వల్ల కుంగిపోతున్న కుమారుడు రాజేష్..
ఇటీవల కత్తితో నరికేందుకు రాగా తప్పించుకున్నట్లు మహేశ్ తృటిలో తప్పించుకున్నాడు. దేవేందర్, శాంతలు కలిసి కత్తితో అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించారని, అయితే మహేశ్ జాగ్రత్తగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడని చెబుతున్నాడు. ఈ దాడి తర్వాత మహేశ్ భయాందోళనలకు గురవుతున్నాడు. తనకు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాడు. కుమారుడు రాజేష్ కూడా ఈ పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతున్నాడు. మహేశ్ తన ఫిర్యాదులో, శాంత, దేవేందర్‌లు తనను హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని, ఇప్పటికే పలు సార్లు ప్రయత్నించారని పేర్కొన్నాడు.

Also Read: రాష్ట్రంలో ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు

Advertisement

పెద్ద మనుషుల సమక్షంలో భర్త మహేశ్ పంచాయతీ పెట్టించగా.. దేవేందర్‌కు జరిమానా
పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి, విచారణ ప్రారంభించారు. పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రవీణ్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో, ముందుగా కౌన్సెలింగ్ చేయాలని భావిస్తున్నారు. అయితే, ప్రాణహాని ఆరోపణలు ఉండటంతో, శాంత, దేవేందర్‌లను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. గ్రామ పెద్దలను కూడా సంప్రదించి, పంచాయతీ వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఎలా నాశనం చేస్తాయో ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×