E-Paper
Advertisement

Festival Special Trains: చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో రైల్వే గుడ్ న్యూస్!

Festival Special Trains: చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో రైల్వే గుడ్ న్యూస్!

Festival Special Trains From Charlapalli:

పండుగ సీజన్‌ లో ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి 22 పండుగ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు చర్లపల్లి- ససారాం మధ్య రాకపోకలు కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ సర్వీసులు సెప్టెంబర్ 11 నుంచి మొదలుకొని నవంబర్ 21 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.  దూర ప్రయాణీకులకు అవసరమైన అదనపు ప్రయాణ సౌకర్యాలను అందిస్తాయి దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

చర్లపల్లి నుంచి నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే!

సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. 07021 నంబర్ గల పండుగ ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి సెప్టెంబర్ 11- నవంబర్ 20 వరకు ప్రతి గురువారం రాకపోకలు కొనసాగిస్తుంది. అటు 07022 నెంబర్ గల రైలు ససారాం నుంచి సెప్టెంబర్ 12- నవంబర్ 21 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ప్రతి రూట్ లోనూ మొత్తం 11 సర్వీసులను ప్లాసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు మొత్తం 22 ట్రిప్పులు వేయనుంది.

ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

ఈ పండుగ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌ నగర్, బల్హర్షా, నాగ్‌ పూర్, ఇటార్సి, పిపారియా, మదన్ మహల్, కట్ని, సత్నా, మాణిక్‌ పూర్, ప్రయాగ్‌ రాజ్ ఛోకి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భాబువా రోడ్ లాంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. ఇవి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణీకులకు అనుగుణంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ఈ రైళ్లలో ఉండే కోచ్ క్లాస్ లు

ప్రత్యేక రైళ్లలో 1 AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎంపికలకు అనుగుణంగా బెర్తులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పండుగ రద్దీని తగ్గించడం, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా, సురక్షితంగా చేరుకోవడం లక్ష్యంగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

రైల్వే అధికారుల కీలక సూచన

పండుగ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయాణీకులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడకుండా ఈ అదనపు రైళ్లను వినియోగించుకోవాలన్నారు. ఈ పండుగ స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల పీక్ డిమాండ్ సమయంలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందే అవకాశం ఉందన్నారు. ఈ రైళ్లు దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగల సమయంలో ఎక్కువ రాకపోకలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రైలును సుమారు 22 ట్రిప్పులు వేయిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ పెరుగుతున్న కొద్దీ మరిన్ని అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ఏకంగా 12 వేల అదనపు రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే భారతీయ రైల్వే ప్రకటించింది.

Read Also:  బస్సును ఢీకొట్టిన రైలు, 10 మంది స్పాట్ డెడ్!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×