E-Paper
Advertisement

Indian Railways: రైల్వే టికెట్లపై వీరికి 100 శాతం డిస్కౌంట్, కారణం ఏంటంటే?

Indian Railways: రైల్వే టికెట్లపై వీరికి 100 శాతం డిస్కౌంట్, కారణం ఏంటంటే?
Advertisement

IRCTC Ticket Booking:

దేశంలో ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తారు. వారి బడ్జెట్ ను బట్టి జనరల్, స్లీపర్, ఏసీ కోచ్ లలో ప్రయాణం చేస్తుంటారు. ఏసీ, స్లీపర్ కోచ్ లలో టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రతి ఒక్కరికీ బెర్త్ లభిస్తుంది. కానీ, జనరల్ లో సీట్ గ్యారెంటీ అనేది ఉండదు. సెకెండ్ క్లాస్ టికెట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు జనరల్ సీట్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారతీయ రైల్వే కొంత మందికి టికెట్ కాస్ట్ లో రాయితీ అందిస్తుంది. దానికి కారణం ఏంటంటే..

రోగులకు ప్రత్యేక రాయితీ

ఆరోగ్య కారణాలతో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే ఛార్జీలలో రాయితీని కల్పిస్తుంది. ఈ తగ్గింపు అనేది ఆయా ఆరోగ్య సమస్యను బట్టి ఉంటుంది. రోగులకు ఆర్థిక ఉపశమనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రాయితీ ద్వారా వారు చికిత్స కోసం సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

క్యాన్సర్ రోగులకు  ఎక్కువ రాయితీ

Advertisement

క్యాన్సర్ రోగి తన భాగస్వామితో ప్రయాణిస్తుంటే, రైల్వే అతడికి/ఆమెకు స్లీపర్, AC-3 టైర్‌ లో 100 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. ఫస్ట్ AC, AC-2 టైర్‌లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌లో 75 శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

హార్ట్ సర్జరీ, డయాలసిస్ రోగులకు..

గుండె ఆపరేషన్, డయాలసిస్ కోసం ప్రయాణించే రోగులకు రైల్వే సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, AC-3 టైర్, AC చైర్ కార్‌ లలో 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఫస్ట్ AC, AC-2 టైర్‌ లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వారి అటెండర్లకు కూడా అదే సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

TB, ఇతర తీవ్రమైన వ్యాధులు

Advertisement

TB రోగులు, వారి అటెండర్లకు సెకండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌లో 75 శాతం ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. దీనితో పాటు, రక్తహీనత రోగులకు స్లీపర్, AC చైర్ కార్, AC-3, AC-2 టైర్‌లో 50 శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది, తద్వారా చికిత్స కోసం ప్రయాణం సులభతరం అవుతుంది.

తలసేమియా, కుష్టు వ్యాధి గ్రస్తులకు

అటు కుష్టు వ్యాధిగ్రస్తులకు సెకెండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్ లో 75 శాతం రాయితీ ఇవ్వబడుతుంది. తలసేమియా, హిమోఫిలియా రోగులు చికిత్స,  చెకప్ కోసం వెళ్తే ఒక అటెండర్‌ కు 75 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. ఎయిడ్స్ రోగులకు సెకెండ్ క్లాస్ లో 50 శాతం ఛార్జీ మినహాయింపు లభిస్తుంది.

రైల్వే టికెట్ల మీద తగ్గింపు పొందాలంటే ఎలా?

రైల్వే అందించే రాయితీ పొందడానికి, సదరు వ్యాదిగస్తులు గుర్తింపు పొందిన ఆసుపత్రి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం కాపీని ఇవ్వాలి. వికలాంగులైన ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో వైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించాలి. ఈ సౌకర్యం 300 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.

Read Also:  ఆ విమానంలోని సీట్ల నిండా బంగాళ దుంపల బస్తాలు వేశారు.. ఎందుకో తెలుసా?

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×