Gundeninda GudiGantalu Today episode march 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలుని తిట్టాను అని సుగుణమ్మ ఇంటికి వెళ్లి బాధపడిపోతూ ఉంటుంది. మంచి వాళ్లని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాను అర్థం కావడం లేదు అని సుగుణమ్మ బాధపడిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన సుగుణమ్మ మీనా బాలు లాంటి మంచి వాళ్ళని బాధ పెట్టాను అని ఫీల్ అయిపోతూ ఉంటుంది.. ఈ మాత్రం నాకన్నా వాళ్ళు నీకు ఎక్కువైపోయారా అని తిడుతుంది.. కానీ రోహిణి కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది సుగుణమ్మ.. నా కొడుకుకి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఏం చేయనవసరం లేదు అని రోహిణి అంటుంది.. మొత్తానికి సుగుణమ్మ రోహిణిపై రివర్స్ అవుతుంది.
తర్వాత రోజు ఉదయం మౌనిక తో పూజ చేయించాలని ప్రభావతి అందరిని గుడికి తీసుకుని వెళుతుంది. అయితే అందరూ కూడా పూలదండలు అవి ఇవి తీసుకుని వచ్చారని ప్రభావతి అంటుంది. పూలదండలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? అని మీనా పై ప్రభావతి సీరియస్ అవుతుంది. అప్పుడే మీనా వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ పూల మాలలు ఫ్రెష్ గా కట్టి ఇవ్వమని చెప్పింది అని ఇస్తుంది.. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా మీనాపై ప్రభావతి సీరియస్ అవుతుంది. మొత్తానికి పూజ చాలా బాగా జరుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. విద్య దగ్గరికి వెళ్లి నేను ఆ డబ్బులు తీసుకొని వస్తాను అని రోహిణి అంటుంది.. ఇక విద్య అక్కడికి వెళ్ళగానే సుగుణమ్మ కూడా అలాగే వెళ్లడంతో రాజేష్ అది చూసి బాలు కి ఫోన్ చేసి చెప్తాడు. అయితే బాలు వీళ్లిద్దరు ఎందుకు అటు వెళ్లారు అని తెలుసుకునేందుకు వస్తాడు.. రోహిణికి సుగుణమ్మ దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అయితే రోహిణి చింటుతో ఆడుకుంటూ సరదాగా కడుతుంది. ఇక బాలు కి విద్య మీద డౌట్ రావడంతో తన ఇంటికి వస్తాడు.. అయితే విద్య ఆ విషయాన్ని ఫోన్ చేసి బాలు కి డౌట్ వచ్చింది మన ఇంటి వైపే వస్తున్నాడు అని అనగానే రోహిణి అలర్ట్ అవుతుంది.
డోర్ తీయడానికి వెళ్ళిన చింటూని రోహిణి ఆపేసి లోపలికి తీసుకొని వెళుతుంది.. అయితే బాలు కిటికీలోంచి చూసి ఎవ్వరు లేరు రాజేష్ ఎందుకు ఇలా చెప్పాడు అని అంటాడు. అక్కడినుంచి బాలు వెళ్ళగానే విద్య అక్కడికొస్తుంది.. ఎందుకు రోహిణి బాలు కి అనుమానం వచ్చినట్లుంది నన్ను అడిగాడు.. ఎవరో ఒక ఆవిడ ఉంది అని అన్నారు.. వస్తే ఇంకా అంతే సంగతి అని రోహిణి తో విద్య అంటుంది.. అప్పుడే ప్రభావతి ఫోన్ చేసి రోహిణి నువ్వు ఎక్కడున్నావ్ అర్జెంటుగా ఇక్కడికి రా అనేసి అంటుంది.. మా అత్తయ్య ఏదో జరిగినట్లు ఫోన్ చేసింది నాకు ఏదో భయంగా ఉంది. ఆ బాలు ఇంకొకరకంగా నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడేమో నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటుంది.
ఇక తర్వాత గుడిలో ఉన్న మాణిక్యాన్ని చూసిన ప్రభావతి మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మలేషియా నుంచి ఎప్పుడు వచ్చారు.. రోహిణి వాళ్ళ నాన్న జైల్ నుంచి రిలీజ్ అయ్యాడా? ఆస్తులు ఎక్కడున్నాయి అని అడుగుతుంది. అయితే అందరూ కూడా మాణిక్యం ని రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేస్తారు. ఇప్పటివరకు అబద్ధం చెప్పకూడదని అనుకున్నాను కానీ ఇవాళ నన్ను అబద్ధం చెప్పేలా చేస్తున్నారు మౌనం వ్రతం అని తప్పించుకోవడం మేలు అని మాణిక్యం ప్లాన్ చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఏమైంది అమ్మ అందరు ఏంటి అక్కడ ఉన్నారు అని మౌనికని అడుగుతారు..
Also Read : భాగ్యం ప్లాన్ రివర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద.. బాధపడ్డ రామరాజు..
మొత్తం అక్కడికి వెళ్లి చూడగానే మాణిక్యం అక్కడున్నంతో బాలు మేక మామ నువ్వు ఎప్పుడొచ్చావు అని అంటాడు. అయితే ఇక మాణిక్యం నుంచి నిజాలు రప్పించడానికి బాలు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు అప్పుడు అక్కడికి వచ్చిన రోహిణి మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతుంది.. మా మామయ్య ఏడాదిలో వారం రోజులు పాటు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మొక్కులు చెల్లిస్తూ ఉంటాడు మా అత్తయ్య ఇందాక నుంచి ఫోన్ చేస్తూనే ఉంది అని రోహిణి మరొక అబద్ధం చెప్పి అక్కడి నుంచి మాణిక్యాన్ని పంపిచేస్తుంది.. బాలు ఏంటి పాలరమ్మ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు.. విద్య దగ్గర వడ్డీ డబ్బులు తీసుకొని వచ్చేసాను అని అంటుంది. తర్వాత రోజు ఉదయం బాలు మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ సుమతి ఏదో గొడవ జరిగి ఉంటుందని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన శివ తనని ఎగ్జామ్ రాయనివ్వకుండా గుణ చేస్తున్నాడని చెప్పగానే బాలు నేను ఎగ్జామ్ రాసేలా చేస్తాను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…