E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Vijayawada: సింగపూర్ టూర్‌కి టీచర్లు.. 37 మంది టీమ్, మంత్రి నారా లోకేష్ రియాక్షన్

Vijayawada: సింగపూర్ టూర్‌కి టీచర్లు.. 37 మంది టీమ్, మంత్రి నారా లోకేష్ రియాక్షన్
Advertisement

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 37 మంది టీచర్లను ఎంపిక చేసింది. వారికి ప్రత్యేక శిక్షణ కోసం సింగపూర్‌కు పంపింది. ఈ విధంగా ఏపీ నుంచి ఓ టీమ్ సింగపూర్ వెళ్లడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ నుంచి సింగపూర్‌కు టీచర్ల టీమ్..  ఐదు రోజుల పర్యటన

Advertisement

అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల టీ‌మ్‌ను సింగపూర్‌కు పంపించింది. మే నాలుగు నుంచి 9 వరకు ఉపాధ్యాయుల టీమ్ అక్కడ పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా విదేశీ విద్యా విధానాలను అధ్యయనం చేయనుంది.

అంతేకాదు ఉత్తమ బోధనా పద్ధతులను గమనించనుంది. అక్కడి పాఠశాలల్లో అనుసరిస్తున్న వినూత్న బోధన పద్దతులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాంకేతికతను విద్యలో ఏ విధంగా అనుసంధానం చేస్తున్నారో పరిశీలించనుంది. ఈ అధ్యయనం తర్వాత ఏపీ విద్యా రంగంలో మరిన్ని సానుకూల మార్పులు తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం.

Advertisement

విదేశీ విద్యా విధానాలపై అధ్యయనం..  ఉత్తమ బోధనా పద్ధతులపై ఫోకస్

దీనిపై మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఈ టూర్‌లో భాగంగా ఉపాధ్యాయులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్‌లో ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రపంచ స్థాయి ఉత్తమ విద్యా విధానాలను నేర్చుకుని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశమని వివరించారు మంత్రి లోకేష్.

అంతర్జాతీయ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపడి, విద్యా వ్యవస్థ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో మరొక విషయం వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ పలుమార్లు ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల టీమ్‌ను ప్రపంచ స్థాయి విద్యా విధానాలపై అధ్యయనం కోసం త్వరలో  అక్కడకు పంపవచ్చని వార్తలు లేకపోలేదు.

ALSO READ: హైదరాబాద్ నివాసంలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

 

Related News

విజయసాయిరెడ్డి లీక్స్.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విసుర్లు, డ్వాక్రా సంఘాల మాటేంటి?

ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!

తాగి బండెక్కితే కేసులు పెట్టొద్దు.. పోలీసులకు ఏలూరు ఎంపీ వింత రిక్వెస్ట్!

తల్లికి వందనం పథకం.. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు క్లారిటీ, ఒక్కసారి చెక్ చేసుకోండి

Vijayawada: సాయికృష్ణ కేసులో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?

సాయిబాబాపై ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు.. నేనూ ఆయన భక్తుడినే అంటూ..

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు, న్యాయస్థానం ముందుకు

Big Stories

×