Vijayawada: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 37 మంది టీచర్లను ఎంపిక చేసింది. వారికి ప్రత్యేక శిక్షణ కోసం సింగపూర్కు పంపింది. ఈ విధంగా ఏపీ నుంచి ఓ టీమ్ సింగపూర్ వెళ్లడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ నుంచి సింగపూర్కు టీచర్ల టీమ్.. ఐదు రోజుల పర్యటన
అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల టీమ్ను సింగపూర్కు పంపించింది. మే నాలుగు నుంచి 9 వరకు ఉపాధ్యాయుల టీమ్ అక్కడ పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా విదేశీ విద్యా విధానాలను అధ్యయనం చేయనుంది.
అంతేకాదు ఉత్తమ బోధనా పద్ధతులను గమనించనుంది. అక్కడి పాఠశాలల్లో అనుసరిస్తున్న వినూత్న బోధన పద్దతులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాంకేతికతను విద్యలో ఏ విధంగా అనుసంధానం చేస్తున్నారో పరిశీలించనుంది. ఈ అధ్యయనం తర్వాత ఏపీ విద్యా రంగంలో మరిన్ని సానుకూల మార్పులు తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం.
విదేశీ విద్యా విధానాలపై అధ్యయనం.. ఉత్తమ బోధనా పద్ధతులపై ఫోకస్
దీనిపై మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఈ టూర్లో భాగంగా ఉపాధ్యాయులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్లో ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రపంచ స్థాయి ఉత్తమ విద్యా విధానాలను నేర్చుకుని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశమని వివరించారు మంత్రి లోకేష్.
అంతర్జాతీయ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపడి, విద్యా వ్యవస్థ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో మరొక విషయం వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ పలుమార్లు ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల టీమ్ను ప్రపంచ స్థాయి విద్యా విధానాలపై అధ్యయనం కోసం త్వరలో అక్కడకు పంపవచ్చని వార్తలు లేకపోలేదు.
ALSO READ: హైదరాబాద్ నివాసంలో పవన్ కళ్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
మంత్రి లోకేష్ గారి సంస్కరణలలో భాగంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ కి వెళ్తున్నారు. అక్కడ బడులలో వారు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ టీచర్ల బృందం సింగపూర్ వెళ్తోంది.#IdhiManchiPrabhutvam#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/CUINqo4HX4
— Telugu Desam Party (@JaiTDP) May 2, 2026