E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం
Advertisement

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి సరికొత్త వెలుగులు వచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జొన్నగిరి గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో ఏపీ ఖనిజ సంపద రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైనట్లయింది.

రెండో యూనిట్‌కు శంకుస్థాపన.. ప్రాసెసింగ్ పరిశీలన

Advertisement

కేవలం ప్లాంట్‌ను ప్రారంభించడమే కాకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాంటు విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రెండో యూనిట్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం, ప్లాంటు లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న గోల్డ్ ప్రాసెసింగ్ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

విజయవాడ సాయికృష్ణ కేసుపై ఘాటు స్పందన

Advertisement

అశోకుడి నాల్గవ రాజధాని అయిన నాటి ‘స్వర్ణగిరి’ని నేడు మనం ‘జొన్నగిరి’గా పిలుచుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండి ఉండేదని, ఇక్కడ లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, ఇప్పుడున్న జొన్నగిరి పేరునే ఉంచుకుందామా? లేక పూర్వ వైభవాన్ని గుర్తుచేసేలా మళ్లీ పాత పేరు అయిన ‘స్వర్ణగిరి’గా మార్చుకుందామా? అని సీఎం చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.

జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు రాజకీయ, శాంతిభద్రతల అంశాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ కేసు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసులో కొందరు కావాలనే కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సదరు సీఐ కాపు సామాజికవర్గానికి చెందినవారేనని, బాధితుడు కూడా కాపు కులస్తుడేనని స్పష్టం చేశారు. కానీ, దీనికి కూడా కొందరు రాజకీయ రంగు పులిమి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్షాలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక

రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్న శక్తులకు సీఎం చంద్రబాబు ఈ సభ వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదని, అలా ప్రవర్తించే వారి నోర్లు మూయించే శక్తి ఎన్డీయే ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ‘గొడ్డలి పార్టీ’ రాత్రింబవళ్లు కుట్రలు పన్నుతోందని, రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారీగా విడదీస్తూ రోజూ విషాన్ని చిమ్ముతోందని విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ, సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.

రాయలసీమే భవిష్యత్ ఇండస్ట్రియల్ హబ్

బెంగళూరు నుండి పుట్టపర్తి వరకు ఉన్న ప్రాంతాన్ని ఒక భారీ డిఫెన్స్ కారిడార్‌గా మార్చబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దేశంలో విమానాలు తయారు చేయడానికి పెద్దగా అవకాశాలు లేకపోయినా, భవిష్యత్తులో రాయలసీమలోనే విమానాలను తయారు చేసే పరిస్థితిని తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: కోల్‌కతాలో కూలిన పాత గోదాం.. శిథిలాల కింద 30 మంది కార్మికులు!

Related News

విజయసాయిరెడ్డి లీక్స్.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విసుర్లు, డ్వాక్రా సంఘాల మాటేంటి?

ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!

తాగి బండెక్కితే కేసులు పెట్టొద్దు.. పోలీసులకు ఏలూరు ఎంపీ వింత రిక్వెస్ట్!

తల్లికి వందనం పథకం.. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు క్లారిటీ, ఒక్కసారి చెక్ చేసుకోండి

Vijayawada: సాయికృష్ణ కేసులో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?

సాయిబాబాపై ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు.. నేనూ ఆయన భక్తుడినే అంటూ..

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు, న్యాయస్థానం ముందుకు

Big Stories

×