E-Paper
Advertisement

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన
Advertisement

Hyderabad: తెలంగాణలో జనసేన పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతోందా? ఆ పార్టీ యాక్టివేట్ అయితే ఏ పార్టీ ఓట్లను చీల్చనుందా? జాతీయ పార్టీల ఓట్లా? లేకుంటే ప్రాంతీయ పార్టీల ఓట్లా? ఇవే ప్రశ్నలు రాజకీయ పార్టీలను వెంటాడుతున్నాయి? ఈ లెక్కన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జనసేన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు

Advertisement

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు జోరందుకోనుంది. హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యాలయాన్ని రెడీ చేసింది. మణికొండలో ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఆఫీసు ఏర్పాటు చేశారంటే ఆ పార్టీ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. దానికి సంబంధించి తెర వెనుక పనులు జరుగుతున్నాయి.

కొన్నాళ్లుగా తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనసేన తెలంగాణపై ఫోకస్ చేసింది. అందుకు కారణాలు లేకపోలేదు. తమిళనాడు ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ద్రవిడ పార్టీలను పక్కన పెట్టేశారు. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీకి ప్రజలు పట్టారు.

Advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికలపై జనసేన ఫోకస్

ఒక విధంగా చెప్పాలంటే యూత్ ఓటర్లు(జెన్ జీ) ఎక్కువగా టీవీకే వైపు మొగ్గు చూపినట్టు తేలింది. ఈ క్రమంలో జనసేన దృష్టి పెట్టినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. దీనిపై ఇప్పటికే జనసేన అధినేత సంకేతాలు ఇచ్చారు.

పొత్తుల విషయమై ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు తాము ఏమీ అనుకోలేదని మనసులోని మాట బయటపెట్టారు. ఈ లెక్కన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశముందని ఆ పార్టీ నేతల మాట.

ALSO READ: తెలంగాణలో మూడురోజులు భానుడి ప్రతాపం.. హైదరాబాద్ అయితే, ఆ తర్వాతే వాన కబురు 

జనసేన ఎన్నికల బరిలోకి దిగడంతో ఎవరి ఓట్లు చీల్చుతారనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీల ఓట్లు చీల్చుతారా? లేకుంటే ప్రాంతీయ పార్టీల ఓట్లు డైవర్ట్ అవుతాయా? దీనిపై పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు.  మొత్తానికి ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

 

Related News

తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

Big Stories

Advertisement
×