E-Paper
Advertisement

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన
Advertisement

Hyderabad: తెలంగాణలో జనసేన పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతోందా? ఆ పార్టీ యాక్టివేట్ అయితే ఏ పార్టీ ఓట్లను చీల్చనుందా? జాతీయ పార్టీల ఓట్లా? లేకుంటే ప్రాంతీయ పార్టీల ఓట్లా? ఇవే ప్రశ్నలు రాజకీయ పార్టీలను వెంటాడుతున్నాయి? ఈ లెక్కన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జనసేన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు

Advertisement

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు జోరందుకోనుంది. హైదరాబాద్‌లో ఆ పార్టీ కార్యాలయాన్ని రెడీ చేసింది. మణికొండలో ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఆఫీసు ఏర్పాటు చేశారంటే ఆ పార్టీ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. దానికి సంబంధించి తెర వెనుక పనులు జరుగుతున్నాయి.

కొన్నాళ్లుగా తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనసేన తెలంగాణపై ఫోకస్ చేసింది. అందుకు కారణాలు లేకపోలేదు. తమిళనాడు ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ద్రవిడ పార్టీలను పక్కన పెట్టేశారు. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీకి ప్రజలు పట్టారు.

Advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికలపై జనసేన ఫోకస్

ఒక విధంగా చెప్పాలంటే యూత్ ఓటర్లు(జెన్ జీ) ఎక్కువగా టీవీకే వైపు మొగ్గు చూపినట్టు తేలింది. ఈ క్రమంలో జనసేన దృష్టి పెట్టినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. దీనిపై ఇప్పటికే జనసేన అధినేత సంకేతాలు ఇచ్చారు.

పొత్తుల విషయమై ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు తాము ఏమీ అనుకోలేదని మనసులోని మాట బయటపెట్టారు. ఈ లెక్కన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశముందని ఆ పార్టీ నేతల మాట.

ALSO READ: తెలంగాణలో మూడురోజులు భానుడి ప్రతాపం.. హైదరాబాద్ అయితే, ఆ తర్వాతే వాన కబురు 

జనసేన ఎన్నికల బరిలోకి దిగడంతో ఎవరి ఓట్లు చీల్చుతారనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీల ఓట్లు చీల్చుతారా? లేకుంటే ప్రాంతీయ పార్టీల ఓట్లు డైవర్ట్ అవుతాయా? దీనిపై పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు.  మొత్తానికి ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

 

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×