Vastu Tips: నేటి తరం యువత తీరు ఎలా ఉందంటే.. ఉదయం కళ్లు తెరిచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో లేకపోతే అన్నం కూడా తినని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా స్క్రోలింగ్, మెసేజ్లు చూసుకోవడం, ఈ-మెయిల్స్ చెక్ చేయడం లాంటివి మనకు తెలియకుండానే అలవాటుగా మారిపోయాయి. చివరకు బాత్రూమ్లోకి వెళ్లేటప్పుడు కూడా ఫోన్ను వెంట తీసుకెళ్లడం చాలా మందికి కామన్ అయిపోయింది. అయితే, ఈ చిన్న అలవాటు మన జీవితంపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతుందో ప్రముఖ వాస్తు నిపుణురాలు, జ్యోతిష్యురాలు జై మదాన్ ఒక వీడియో ద్వారా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాత్రూమ్ అనేది శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, మలినాలను వదిలించుకోవడానికి నిర్దేశించిన స్థలం. అది ఎంత అందంగా, ఖరీదైనదిగా ఉన్నప్పటికీ.. వాస్తు ప్రకారం అక్కడ ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అది కేవలం విసర్జనకు, శుద్ధికి సంబంధించిన చోటు మాత్రమే. అలాంటి ప్రదేశంలో కూర్చుని ఫోన్ చూడటం అస్సలు మంచిది కాదని వాస్తు నిపుణురాలు స్పష్టం చేశారు.
Also Read: టాయిలెట్ క్లీనర్లతో ప్రాణాంతక ముప్పా? ప్రతి ఇంట్లోనూ జరిగే అతిపెద్ద తప్పు ఇదే!
చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుని బాత్రూమ్లోకి వెళ్తారు. అక్కడే కూర్చుని ఆఫీస్ మెసేజ్లు, మెయిల్స్ చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల సృజనాత్మకత, ఆలోచనా శక్తి తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. రోజంతా ఉత్సాహంగా పని చేయాల్సిమనలోనిన శక్తిని, మంచి అవకాశాలను ఉదయాన్నే అక్కడ వృథా చేసినట్లు అవుతుంది. పైగా ఫోన్ చూస్తూ ఉండటం వల్ల అవసరమైన సమయం కంటే ఎక్కువ సేపు అక్కడే గడపాల్సి వస్తుంది.
ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ అనేది కేవలం మాట్లాడుకునే సాధనం కాదు. అది మన పర్సు లేదా వాలెట్తో సమానం. ఎందుకంటే డబ్బుల లావాదేవీలన్నీ దాని ద్వారానే జరుగుతున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక విషయాలన్నీ ఫోన్తోనే ముడిపడి ఉన్నాయి. మనం డబ్బులను బాత్రూమ్లో పెట్టడానికి ఇష్టపడం కదా, మరి అంతటి విలువైన ఫోన్ను అక్కడికి తీసుకెళ్లడం మంచిది కాదు. కాబట్టి టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడైనా ఫోన్ను దూరంగా పెట్టడం వల్ల మనలోని సానుకూల శక్తి, మంచి అవకాశాలు చేజారిపోకుండా ఉంటాయట.
Also Read: వ్యాక్సింగ్, షేవింగ్ లేదా లేజర్? చర్మానికి ఏది సేఫ్.. డెర్మటాలజిస్ట్ రేటింగ్స్ ఇవే!