Top Car Brands in India: భారత్ లో కార్ల మార్కెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ బ్రాండ్లు కలిసి వినియోగదారులకు క్రేజీ కార్లను అందిస్తున్నాయి. ప్రతి కంపెనీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని కంపెనీలు భద్రతపై దృష్టి పెడితే, మరికొన్ని మైలేజ్, ఫీచర్లు, డిజైన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. అందుకే కారును సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కారు కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఇంతకీ ఇండియాలోని పాపులర్ కార్లు ఏ దేశానికి చెందినవో ముందుగా తెలుసుకుందాం..
భారత్ లో ప్రముఖ బ్రాండ్లలో టాటా మోటార్స్ ఒకటి. ఈ కంపెనీ ముఖ్యంగా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి క్రాష్ టెస్ట్ రేటింగ్స్ తో వినియోగదారుల నమ్మకాన్ని పొందింది.
మహీంద్రా కూడా బలమైన SUVతో మంచి పేరు సంపాదించింది. గ్రామీణ ప్రాంతాల్లో, కఠినమైన రోడ్లపై సులభంగా నడిచే వాహనాలను తయారు చేయడంలో ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది.
ఇది భారత్, జపాన్ కు చెందిన కంపెనీల భాగస్వామ్యంతో రూపొందింది. ఇది సాధారణ వినియోగదారుల మొదటి ఆప్షన్ గా కొనసాగుతుంది. తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లాంటి కారణాల వల్ల ఇది మార్కెట్ లో ముందంజలో ఉంది. మొదటిసారి కారు కొనేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈ రెండు కంపెనీలు సౌత్ కొరియాకు చెందినవి. ఈ కంపెనీ కార్లు ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్లతో యువతను ఆకర్షిస్తున్నాయి. టచ్ స్క్రీన్లు, సన్ రూఫ్ లు, కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి అంశాలు ఈ కార్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
జపాన్ కు చెందిన ఈ మోడల్స్ దీర్ఘకాలిక నమ్మకానికి ప్రసిద్ధి. వీటి కార్లు చాలా కాలం వరకు సమస్యలు లేకుండా నడుస్తాయని వినియోగదారులు నమ్ముతారు.
ఈ రెండు బ్రాండ్లు మంచి డ్రైవింగ్ అనుభవం, స్థిరత్వం కోసం ప్రసిద్ధి. హైవేలపై ప్రయాణించే వారికి మంచి ఎంపికగా ఉంటాయి.
ఫ్రాన్స్ కు చెందిన రెనాల్ట్, సిట్రోయెన్ కంపెనీలు భిన్నమైన డిజైన్, కంఫర్ట్ ను అందిస్తాయి. ఇక బ్రిటీష్ మూలాలున్న ఎంజీ మోటార్ ఆధునిక టెక్నాలజీ, పెద్ద స్క్రీన్లు, AI ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఇక భారత్ లోని కార్ల బిల్డ్ క్వాలిటీ ఇతర దేశాలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ధర. ఎక్కువ మంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకుంటారు. అందుకే కంపెనీలు కొన్నిసార్లు బాడీ మెటీరియల్ కంటే ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెడతాయి.
Read Also: టయోటాలో చవకైన కారు.. జస్ట్ రూ. 6.5 లక్షలకే కొనేయండి బ్రో!